
విద్యుదాఘాతంతో ఫర్నిచర్, నగదు దగ్ధం
పెగడపల్లి: నర్సింహునిపేట గ్రామానికి చెందిన ఆరెల్లి దుర్గయ్య ఇంట్లో శనివారం రాత్రి విద్యుదాఘాతం జరిగింది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, దుస్తులతోపాటు ఇతర సామగ్రి, రూ.40వేల నగదు దగ్ధమైందని బాధితుడు పేర్కొన్నాడు. ఆరై శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలడిగి తెలసుకొని పంచనామా నిర్వహించారు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ మండల నాయకులు ఆదివారం పరామర్శించారు. రూ.10వేల నగదుతోపాటు బియ్యం, ఇతర నిత్యావసరాలు అందజేశారు. రాములుగౌడ్, సత్తిరెడ్డి, శ్రీనివాస్, సంది మల్లారెడ్డి తదితరులున్నారు.
నిప్పంటుకొని హార్వెస్టర్..
మేడిపల్లి: రేడియేటర్లో వేడిమి కారణంగా ప్రమాదవశాత్తు మంటలంటుకొని భీమారం మండలం మన్నేగూడెం గ్రామానికి చెందిన పెడిమల్ల గంగాధర్ హార్వెస్టర్ ఆదివారం దగ్ధమైంది. అదే గ్రామానికి చెందిన ఓ రైతు వరిని కోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రెవర్ చాకచక్యంగా హార్వెస్టర్పై నుంచి దూకడంతో ప్రాణలతో బయటపడ్డాడు. స్థానికులు ఫైరింజన్కు సమాచారమివ్వడంతో వచ్చి మంటలార్పారు.