నాకు నువ్వు వద్దు! | - | Sakshi
Sakshi News home page

నాకు నువ్వు వద్దు!

Apr 21 2025 8:19 AM | Updated on Apr 21 2025 8:19 AM

నాకు

నాకు నువ్వు వద్దు!

మూడుముళ్లు.. మూణ్నాళ్ల్లే!
● తెగిపోతున్న వివాహ బంధాలు ● ఏడడుగులు నడిచిన కొన్నాళ్లకే.. ● ఠాణామెట్లు ఎక్కుతున్న యువ జంటలు ● పచ్చని కాపురాల్లో చిచ్చు ● పెరుగుతున్న గృహహింస దరఖాస్తులు ● కోర్టుల్లో నడుస్తున్న విడాకుల కేసులు

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..! అని ప్రమాణాలు చేసుకుని ఒకటవుతున్నారు. అగ్నిహోత్రం చుట్టూ.. ఏడడుగులు నడిచి.. మూడుముళ్లతో వివాహ బంధంలో అడుగిడుతున్నారు. జీలకర్ర.. బెల్లం తలపై పెట్టుకుని ఒకరికొకరు నూరేళ్లు కలిసుంటామని బాస చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితంలో కష్టాసుఖాలను సమానంగా పంచుకోవల్సిన పలు కొత్త జంటలు ‘ఆధిపత్య’ పోరుతో ఆదిలోనే తమ నూరేళ్ల సంసార జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. మూణ్నాళ్లకే ‘నాకు నువ్వు వద్దు’ అంటూ.. పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కుతున్నారు. కోర్టుల్లో విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో రోజురోజుకు ఠాణామెట్లు ఎక్కుతున్న జంటల సంఖ్య పెరుగుతుండగా.. జిల్లా కోర్టులోనూ విడాకుల కేసుల సంఖ్య అదేస్థాయిలో కొనసాగుతోంది. – కరీంనగర్‌క్రైం

నమోదైన కేసులు: 330

చిన్న చిన్న కారణాలతో..

● నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవించాల్సిన కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నాయి.

● బతుకుపోరులో.. ఉద్యోగాల వేటలో పెళ్లయిన వెంటనే దూర ప్రాంతాల్లో జీవిస్తూ.. వేరు కాపురాలు పెడుతున్నారు.

● ఉమ్మడి కుటుంబం ఊసే లేకపోతుండగా.. దంపతుల మధ్య అహం, అపార్థం, అనుమానాలు పెరుగుతున్నాయి.

● నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన విషయాలు రోడ్డెక్కుతున్నాయి.

● ఇద్దరి మధ్య అగాథం పెరిగి, పోలీసుస్టేషన్‌, కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి.

● పెద్దలు కుదిర్చినా.. ప్రేమించి పెళ్లి చేసుకు న్నా.. చాలా జంటల్లో అదే తీరు కనిపిస్తోంది.

అవగాహన అవసరం

● కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య విబేధాలు వచ్చినప్పుడు ఇరువురి తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. సమస్యను ఓపిగ్గా విని, పరిష్కారానికి కృషి చేయాలి.

● అలా కాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల నే రెచ్చగొడుతుండడం బాధ కలిగించే అంశమని మహిళా పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.

● అనుమానం, హింస, దాంపత్య బంధం విలువ తెలియకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, హంగుఆర్భాటాలకు పోయి ఆర్థిక పరిస్థితి చితికిపోయి, చిన్న కారణాలతోనే విడాకుల వరకు వెళ్తున్నారని, ఆవేశంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వివరించారు.

● ప్రేమ వివాహం చేసుకున్న వారు సైతం చాలామంది కొన్నాళ్లకే ఠాణామెట్లు ఎక్కుతున్నారని తెలిపారు.

● విడాకులు తీసుకుంటున్న, పోలీసుస్టేషన్‌కు వస్తున్న జంటల్లో ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఉంటున్నారని ఓ సీనియర్‌ కౌన్సిలర్‌ పేర్కొన్నారు.

పెండింగ్‌లో ఉన్నవి: 111

3,116

కౌన్సెలింగ్‌తో పరిష్కరించినవి

జిల్లాలో ఐదేళ్లుగా గృహహింస

కేసులు

పోలీసులకు

వచ్చిన

ఫిర్యాదులు

3,557

ఐదేళ్లలో కరీంనగర్‌ కోర్టులో నడుస్తున్న విడాకుల కేసులు

పరస్పర

అంగీకారంతో విడాకులు తీసుకున్నవారు

కోర్టులో పెండింగ్‌లో ఉన్న

విడాకుల కేసులు: 288

580

కోర్టులో కేసులతో

విడాకులు

తీసుకున్నవారు: 208

నాకు నువ్వు వద్దు!1
1/2

నాకు నువ్వు వద్దు!

నాకు నువ్వు వద్దు!2
2/2

నాకు నువ్వు వద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement