
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
కరీంనగర్రూరల్: విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెగిపోయిన విద్యుత్ కేబుల్ వైరును మరమ్మతు చేయడంలో జాప్యం చేస్తుండటంతో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక అవస్థలు పడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ మండలం బొమ్మకల్ సబ్స్టేషన్ నుంచి రాజీవ్ రహదారిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా దుర్శేడ్, గోపాల్పూర్, నల్లగుంటపల్లి, చేగుర్తి గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే గురువారం రైల్వే కేబుల్ మరమ్మతు కోసం గుంటూరుపల్లి రైల్వే అండర్బ్రిడ్జి వద్ద గుంతలు తవ్వుతుండగా విద్యుత్ కేబుల్ తెగింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయంగా మొగ్ధుంపూర్ సబ్స్టేషన్ నుంచి వ్యవసాయ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే పలువురు రైతులు పొలాలకు నీళ్లుపెట్టేందుకు మోటార్లు ఉపయోగిస్తుండటంతో ఓవర్లోడ్తో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరాలో పలుమార్లు అంతరాయం ఏర్పడుతోంది. లోవోల్టేజీతో టీవీలు, ఫ్రిజ్లు, బోరు మోటార్లు కాలిపోతున్నాయని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కేబుల్ మరమ్మతు చేసేందుకు మూడు రోజులు పడుతుందంటూ విద్యుత్ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దుర్శేడ్, చేగుర్తి, గోపాల్పూర్ గ్రామాల్లో గతేడాది నుంచి లైన్మెన్లు లేకపోవడంతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే సమస్యలు పరిష్కరించడంలో జాప్యమేర్పడుతుందని తెలిపారు. ఇప్పటికై నా విద్యుత్ సమస్యలను అధికారులు పరిష్కరించాలని కోరారు. కాగా తెగిపోయిన విద్యుత్ కేబుల్ను మరమ్మతు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని విద్యుత్శాఖ రూరల్ ఏడీఈ రఘు తెలిపారు. ఆదివారం ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించనున్నట్లు వివరించారు.
కేబుల్ మరమ్మతులో జాప్యం
అవస్థలు పడుతున్న వినియోగదారులు