
సుర్రుమంటున్న సూరీడు
కామారెడ్డి టౌన్: సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా రోజు 43 డిగ్రీల ఉష్ణోగత కంటే తగ్గకుండా ఎండ మండుతుంది. దీంతో జనాలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు బయటకు రావడం లేరు. కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఇళ్లలో ఉండటం లేరు. నిత్యం రద్దీగా ఉండే పట్టణంలోని ప్రధాన రోడ్లు సిరిసిల్లా రోడ్, జేపీఎన్, సుభాస్, స్టేషన్రోడ్, నిజాంసాగర్ చౌరస్తా, దేవునిపల్లిరోడ్, జాతీయరహదారి, కొత్తబస్టాండ్, విద్యానగర్, అశోన్నగర్ కాలనీరోడ్డు ఇలా రోడ్లన్ని జనాలు లేక నిర్మానుష్యంగా కనబడుతున్నాయి.
బయటకు రావాలంటే
జంకుతున్న జనాలు
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

సుర్రుమంటున్న సూరీడు

సుర్రుమంటున్న సూరీడు