ధాన్యం తేమ శాతం పెంపు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తేమ శాతం పెంపు

Apr 24 2025 12:26 AM | Updated on Apr 24 2025 12:26 AM

ధాన్య

ధాన్యం తేమ శాతం పెంపు

పిఠాపురం: 17 శాతంకు బదులుగా 22 శాతం వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు దళారుల ప్రమేయం రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల వెలువడిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోలుపై బుధవారం పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ పాఠశాలలో కలెక్టర్‌ షణ్మోహన్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కేలా రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. 17 శాతం తేమ ఉండాల్సినప్పటికి 22 శాతం వరకు తేమ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అందుకు సరిపడా ధాన్యం అదనంగా తూకం వేయాలని ఆయన అధికారులకు సూచించారు. 18 శాతం తేమ ఉన్నట్లయితే ఒక కేజీ, 19 శాతం తేమ ఉన్నట్లయితే రెండు కేజీలు, 20 శాతం తేమ ఉన్నట్లయితే మూడు కేజీలు, 21 శాతం తేమ ఉన్నట్లయితే నాలుగు కేజీలు, 22 శాతం తేమ ఉన్నట్లయితే ఐదు కేజీలు ధాన్యం అదనంగా తూకం వేసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నమోదు చేయాలని సూచించారు. 22 శాతం కంటే తేమ ఎక్కువగా ఉన్నట్లయితే రైతు విధిగా ధాన్యాన్ని ఎండబెట్టిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

తేమ శాతం 17 వచ్చిన తర్వాత రైతులు అమ్ముకుంటే ఏ గ్రేడ్‌ రకం 75 కేజీలకు రూ.1,740, సాధారణ రకం 75 కేజీలకు రూ.1,725 పొందవచ్చన్నారు. ధాన్యం అమ్మిన 36 గంటల్లో రైతు బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ జేడీ ఎన్‌.విజయ్‌కుమార్‌, పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం దేవులా నాయక్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్‌ఎస్‌ఎస్‌ సత్యనారాయణ రాజు, వ్యవసాయ శాఖ ఏడి పి స్వాతి పాల్గొన్నారు.

దళారుల ప్రమేయం లేకుండా

కొనుగోలుకు చర్యలు

కలెక్టర్‌ షణ్మోహన్‌

ధాన్యం తేమ శాతం పెంపు1
1/3

ధాన్యం తేమ శాతం పెంపు

ధాన్యం తేమ శాతం పెంపు2
2/3

ధాన్యం తేమ శాతం పెంపు

ధాన్యం తేమ శాతం పెంపు3
3/3

ధాన్యం తేమ శాతం పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement