భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి

Jun 5 2025 8:22 AM | Updated on Jun 5 2025 8:22 AM

భూ సమ

భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి

ధర్మపురి: భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు. మండలంలోని దోనూర్‌ గ్రామంలో బుధవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు ముఖ్య అథితిగా హాజరయ్యారు. ప్రతీ దరఖాస్తును నమోదు చేసుకోవాలని అధికారులకు అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపా రు. బుగ్గా రం మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌ చిలుముల లావణ్య, డిప్యూటీ తహసీల్దార్‌ సుమన్‌ పాల్గొన్నారు.

ఆరుతడి పద్ధతులు పాటించాలి

కథలాపూర్‌: రైతులు వరిసాగులో ఆరుతడి పద్ధతులు పాటించాలని, తద్వారా నీటిని పొదుపు చేసినట్లవుతుందని కరీంనగర్‌ ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్‌ మదన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కథలాపూర్‌ రైతు వేదికలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పంటల్లో సూక్ష్మ నీటిపారుదల, సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబడులు పొందాలన్నారు. యూరియా తక్కువగా వాడాలని, అవసరం మేరకు రసాయనాలు వినియోగించాలన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తే రైతులు రశీదులను భద్రపరచాలన్నారు. రైతులకు పంటల సాగుకు సూచనలిచ్చే కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్‌, ఏవో యోగితా, ఏఈవోలు సంధ్య, సుష్మా, శేఖర్‌, హరీశ్‌, మౌనిక పాల్గొన్నారు.

సెర్ప్‌ కార్యక్రమాలు వేగవంతం చేయాలి

జగిత్యాలరూరల్‌: జిల్లాలోని మహిళా స్వయంశక్తి సంఘాల కార్యక్రమాలు వేగవంతం చేయాలని జిల్లా సెర్ప్‌ ఏపీడీ చరణ్‌దాస్‌ అన్నారు. ఐకేపీ భవన్‌లో బుధవారం వీవోఏలతో సవీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు అందివ్వడం ద్వారా ఆదాయాభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహిళలు కోటీశ్వరులు అయ్యే లా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళాశక్తి కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. ప్రతీ సభ్యురాలికి ఇన్సూరె న్సు సౌకర్యం పొందేలా చూడాలని, గ్రామ, మండల సమాఖ్యల అడిట్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉల్లాస్‌ సర్వే చేయాలని, కొనుగోలు కేంద్రాలు ముగిసినందున డాటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీవో వాస వి, మెడికల్‌ ఆఫీసర్‌ సౌజన్య, సీ్త్రనిధి రీజినల్‌ మేనేజర్‌ రాంనారాయణ, ఏపీఎం గంగాధర్‌, సీసీలు గంగారాం, రవీందర్‌, మరియా, అసిస్టెంట్‌ మేనేజర్లు రాణి, సాహిత్య పాల్గొన్నారు.

మాట్లాడుతున్న చరణ్‌దాస్‌

భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి1
1/2

భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి

భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి2
2/2

భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement