
ఇప్పుడే విత్తనాలు వేయొద్దు
జగిత్యాల అగ్రికల్చర్: ‘నైరుతి రుతుపవనాలు జిల్లాలో ప్రవేశించినప్పటికీ.. పూర్తిస్థాయిలో వర్షాలు కురియడం లేదు. ఈ క్రమంలో జూన్ 15 వరకు విత్తనాలు వేయవద్దు. జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలు పొలంలో చల్లుకోవచ్చు. వాటికి వ్యవసాయ బావుల ద్వారా సాగునీరు అందించాలి. ప్రైవేట్ కంపెనీల విత్తనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జిల్లాలోని అన్ని సొసైటీల్లో రసాయన ఎరువులు అందుబాటులో ఉంచుతాం’. అని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ పేర్కొన్నారు. వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్న క్రమంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో బుధవారం ఫోన్ ఇన్ నిర్వహించగా.. విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు ఫోన్ చేయగా.. వారు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు డీఏవో వివరంగా సమాధానం ఇచ్చారు.
జూన్ 15 తరువాత విత్తుకుంటే ఉత్తమం
అన్ని సొసైటీల్లో అందుబాటులో రసాయన ఎరువులు
ప్రైవేట్ కంపెనీల విత్తనాల విషయంలో జర జాగ్రత్త
జిల్లా వ్యవసాధికారి భాస్కర్
‘సాక్షి’ ఫోన్ ఇన్కు విశేష స్పందన

ఇప్పుడే విత్తనాలు వేయొద్దు