ఏటీసీ పనులు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏటీసీ పనులు త్వరగా పూర్తి చేయాలి

Jun 5 2025 8:22 AM | Updated on Jun 5 2025 8:22 AM

ఏటీసీ పనులు   త్వరగా పూర్తి చేయాలి

ఏటీసీ పనులు త్వరగా పూర్తి చేయాలి

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల: అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాలలోని టీఆర్‌నగర్‌లో రూ.29 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఏటీసీ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. జగిత్యాల–కరీంనగర్‌ రహదారికి సుమారు 800 మీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఏటీసీ సెంటర్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఏటీసీ సెంటర్‌ వల్ల యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ జ్యోతి, నాగభూషణం ఉన్నారు.

అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలి

అభివృద్ధి పనులను వెనువెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డులో రూ.30లక్షలతో చేపడుతున్న డ్రెయినేజీ పనులను ప్రా రంభించారు. కమిషనర్‌ స్పందన, మాజీ చై ర్మన్లు జ్యోతి, గిరి నాగభూషణం పాల్గొన్నారు.

ధ్యానమందిరం కొనసాగించాలి

ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యానమందిరం కొనసాగించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల బ్రాహ్మణవీధిలో ధ్యానమందిరాన్ని బుధవారం ప్రా రంభించారు. ధ్యాన మందిరం ఈశాన్యభాగంలో శిథిలావస్థకు చేరుకుందని, తొలగించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమాకాంత్‌శర్మ, భారవిశర్మ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement