
వరాల వెంకన్న కల్యాణోత్సవాలు ప్రారంభం
అత్తిలి: మండలంలో ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీవరాల వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున భక్తులచే గోవింద మాలా దీక్ష స్వీకరణ కార్యక్రమం జరిగింది. సన్నిధి నాగ వెంకట సత్య సూర్య రామలింగేశ్వరరావు, వీర పద్మ, మామిడిపల్లి రాంబాబు, నాగమణి దంపతులచే స్వామివారికి సుప్రభాత సేవ, మేలుకొలుపు, తోమాల సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం వరాల వేంకటేశ్వర స్వామి వారిని పెండ్లి కుమారునిగాను, శ్రీ దేవి భూదేవి అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరించారు. పడాల వెంకటేశ్వరరావు దంపతులు శేషవస్త్రాలు సమర్పించారు. అల్లూరి సత్యనారాయణరాజు సుబ్బలక్ష్మి, అల్లూరి సీతారామరాజు, మీనాక్షి దంపతులచే ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో విష్వక్సేనపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, గరుడ హోమం, ప్రధాన హోమ పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల వెంకట నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

వరాల వెంకన్న కల్యాణోత్సవాలు ప్రారంభం

వరాల వెంకన్న కల్యాణోత్సవాలు ప్రారంభం