
నీట్కుకట్టుదిట్టమైన ఏర్పాట్లు
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): జిల్లాలో మే 4న నీట్ పరీక్షను పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నీట్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షకు ఏలూరులోని కస్తూర్బా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సబ్బమ్మదేవి మున్సిపల్ హైస్కూల్, దెందులూరు మండలం గోపన్నపాలెంలోని కేంద్రీయ విద్యాలయం, గోపన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. 1200 మంది హజరవుతున్న నేపథ్యంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రం పరిధిలో 144వ సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు సిటీ కో–ఆర్డినేటర్గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ వ్యవహరిస్తారన్నారు.
ఉన్నత లక్ష్యం, పట్టుదల ఉండాలి
ఉన్నత లక్ష్యం, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో కోవిడ్–19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలు, పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీంలో ఉన్న లబ్ధిదారులతో కలెక్టర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 26 మంది బాలబాలికలకు గార్డియన్గా ఉన్న కలెక్టర్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆకాష్ పరీక్షలో తప్పిన ఒక సబ్జెక్ట్కు సప్లిమెంటరీ పరీక్ష రాయించి ఫలితాలు వచ్చాక అప్డేట్ చేయాలని డీసీపీవోకు సూచించారు. పదో తరగతిలో ఒక సబ్జెక్ ఫెయిల్ అయిన అజేయ్ ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలని డీఈవోను ఆదేశించారు. 18 ఏళ్లు నిండి వివాహం చేసుకున్న ఇద్దరు యువతులను కలెక్టర్ ఆశీర్వదించారు. 18 ఏళ్లు నిండిన ఇద్దరికి రూ.10 లక్షలు డిపాజిట్ పోస్టల్ పాస్బుక్స్ కలెక్టర్ అందజేశారు.