భవిష్యత్‌లో మరింత అభివృద్ధి | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌లో మరింత అభివృద్ధి

Published Tue, Mar 26 2024 1:10 AM

ప్రజలకు అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌  - Sakshi

దెందులూరు: ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరింత అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కోరారు. సోమవారం రాత్రి మేధినరావుపాలెం, ధర్మారావుపేట, కొవ్వలివారిగూడెంలో మేము సిద్ధం–మా ఊరు సిద్ధం కార్యక్రమాన్ని ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ మేధినరావుపాలెం గ్రా మాన్ని దత్తత తీసుకుని రూపురేఖలు మారుస్తానని అన్నారు. సీఎం జగన్‌ విద్య, వైద్యం, రైతులు, మహిళలు, వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేశారని, నవరత్నాల పథకాలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారన్నారు. వలంటీర్‌, సచివాలయ వ్యవస్థలతో పాలన చేరువ చేశారన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎంత మంది కలిసి వచ్చినా మరోమారు ముఖ్యమంత్రి అయ్యేది సీఎం జగనే అన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలను నమ్మవద్దని హిత వు పలికారు. ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కు మార్‌ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఎంపీ అభ్యర్థిగా తనను, ఎమ్మెల్యేగా అబ్బయ్యచౌదరిని గెలిపించాలని కోరారు. మరోసారి మోసం చేయడానికి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయని, గత టీడీపీ హయాంలో, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన మేలును బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు.

Advertisement
Advertisement