అంబాజీపేట: బీరు సీసాను పగలగొట్టి ఆ పెంకుతో పీక కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబాజీపేట శివారు జయంతినగర్కు చెందిన ఈతకోట రవి మంగళవారం స్థానిక బస్టాండ్ వెనుక ఓ చెట్టు వద్ద బీరు సీసా పగలగొట్టి ఆ పెంకుతో పీక కోసుకున్నాడు. అక్కడ నుంచి రక్తస్రావంతో బస్టాండ్ వద్దకు వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు స్పందించి 108లో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. రవి పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు తెలియలేదు.
బావిలో పడిపోయిన లేగ దూడ
రక్షించిన పిఠాపురం అగ్నిమాపక అధికారులు
సామర్లకోట: చెంగు..చెంగున గెంతులు వేస్తూ పొలంలో గడ్డి మేస్తున్న లేగ దూడ అక్కడ ఉన్న బావిలో పడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని నవర గ్రామ సమీపంలోని పొలంలో ఉన్న బావిలో లేగ దూడ సోమవారం సాయంత్రం పడిపోయింది. రైతులు పిఠాపురం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సుమారు 20 అడుగుల లోతు ఉన్న బావిలో పడిన లేగదూడను మూడు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక అధికారులు రక్షించారు. దాంతో రైతులు గోమాత జిందాబాద్, అగ్నిమాపక సిబ్బంది జిందాబాద్ అంటూ నినాదా లు చేశారు. బావి నుంచి లేగ దూడ బయట పడటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంట పొలాలకు, రైతులకు నీటి కోసం పూర్వీకులు అ క్కడ బావి ఏర్పాటు చేసినట్టు రైతులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
కాకినాడ క్రైం: కాకినాడకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... నగరంలోని ప్రేజర్పేటకు చెందిన వనమాడి దొరబాబు (45) భార్యతో నెలకొన్న కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి కాకినాడ జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.