
సమస్యల పరిష్కారానికి 1100 టోల్ఫ్రీ నంబర్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారానికి టోల్ఫ్రీ నంబర్ 1100కు ఫిర్యాదు చేయవచ్చని, నమోదైన ఫిర్యాదు స్థితిగతులు తెలుసుకోవచ్చని కలెక్టర్ పి.ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం యథాతథంగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే, ప్రజలు వ్యయప్రయాసలు ఎదుర్కొంటూ ప్రభుత్వ కార్యాలయాలకు రానవసరం లేకుండా 1100 టోల్ఫ్రీ నంబర్కు నేరుగా సమస్యలు తెలియజేసి, పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009ను సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు.
జనన, మరణ, వివాహాల
నమోదులో జాప్యం తగదు
రాజమహేంద్రవరం రూరల్: జనన మరణాలు, వివాహాల నమోదులో ఎటువంటి జాప్యం ఉండకూడదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్ఓ), జిల్లా జనన మరణ రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. ఈ అంశంపై బొమ్మూరులోని తన కార్యాలయంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. జనన మరణాలు, వివాహాల రిజిస్ట్రేషన్లు 100 శాతం జరిగేలా వైద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన విభాగం, మహిళ, శిశు సంక్షేమం – మహిళా సాధికారత విభాగం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇతర విభాగాలు కలిసి పని చేయాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మౌనిక, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ డి.సతీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి 1100 టోల్ఫ్రీ నంబర్