
ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా సత్తిబాబు
గోకవరం: ఆర్యవైశ్య సంఘం తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా గోకవరానికి చెందిన బత్తుల సత్తిబాబు బాధ్యతలు స్వీకరించారు. గోకవరంలో స్థానిక గోపీకృష్ణ ఫంక్షన్ హాలులో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు కార్యదర్శిగా ఇన్నమూరి రాంబాబు, ట్రెజరర్గా కంకటాల మూర్తి, ఇతర కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
పాలిసెట్కు
89.85 శాతం హాజరు
రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించిన పాలిసెట్–2025 ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 11 పరీక్షా కేంద్రాలలో 89.85శాతం మంది విద్యార్థులు పాలిసెట్ రాశారు. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.00గంట వరకు జరిగిన ప్రవేశ పరీక్షకు 5,765 మందికిగాను 5,180 మంది విద్యార్థులు హాజరయ్యారు. 585 మంది గైర్హాజరయ్యారని బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ వి.నాగేశ్వరరావు తెలిపారు.
ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రించాలి
రాజమహేంద్రవరం సిటీ: ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రాజమహేంద్రవరం ఏిపీ ఎన్జీవో హోమ్లో క్యాప్కో ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. క్యాప్కో జిల్లా కన్వీనర్ ధర్నాలకోట వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి అనంతరావుతో పాటు క్యాప్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ఎస్ రామకృష్ణ, కోకోఫెడ్ చైర్మన్ అరిగెల బలరామమూర్తి, కోకోఫెడ్ జనరల్ సెక్రెటరీ ఆదిత్య కిరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరావు మాట్లాడుతూ తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు తక్షణం ఫుడ్ సేఫ్టీ ఆక్ట్ 2006 కమిటీ సభ్యుల నియామకం చేపట్టాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రైవేటు స్కూళ్లు కాలేజీల ఫీజుల నియంత్రణ చేయాలని, అధిక ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినియోగదారుల సంఘాల సభ్యులు నాగభూషణం, శ్రీనివాసరావు, ఆనంద్ పాల్గొన్నారు.
మంగళసూత్రాలు,
వెండి పళ్లెం సమర్పణ
కొత్తపేట: విశాఖపట్నంలో శ్రీవెంకటకృష్ణ అన్నమాచార్య ఆధ్యాత్మిక సేవా సంస్థ సభ్యుల బృందం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారికి సుమారు రూ.6 లక్షల విలువ చేసే మంగళసూత్రాలు, వెండి పళ్లెం సమర్పించింది. 42 గ్రాముల రెండు మంగళసూత్రాలు. ఒకటిన్నర కేజీల వెండిపళ్లాన్ని సంస్థ ఆర్గనైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో క్షేత్రంలో దేవస్థాన అధికారుల ద్వారా ఆలయ అర్చకులకు అందజేశారు. సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి దొరబాబు, సుధారాణి దంపతులు వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ.1,00,700 విరాళంగా సమర్పించారు.

ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా సత్తిబాబు

ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా సత్తిబాబు

ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా సత్తిబాబు