
సంధిపూడి విద్యార్థికి ఆలిండియా 1533 ర్యాంకు
ఆలమూరు: మండలంలోని సంధిపూడికి చెందిన తోట మోహన్ నాగవీరవెంకటరాజు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1533 ర్యాంకు సాధించాడు. గత ఏప్రిల్ 19న విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 3557 ర్యాంకు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. వెంకటరాజు టెన్త్ రాజమహేంద్రవరంలో, ఇంటర్మీడియెట్ విజయవాడలో అభ్యసించాడు. ప్రముఖ జాతీయ విశ్వవిద్యాలయంలో సీటు పొంది, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుతానని వెంకటరాజు తెలిపారు. తల్లి భవానీ సర్పంచ్ కాగా, తండ్రి వెంకటేశ్వర్లు రాజకీయవేత్తగా ఉన్నారు.