తహసీల్దార్‌పై దాడి ఘటనలో చర్యలకు ఆదేశం | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌పై దాడి ఘటనలో చర్యలకు ఆదేశం

Jun 7 2025 12:09 AM | Updated on Jun 7 2025 12:09 AM

తహసీల్దార్‌పై దాడి ఘటనలో చర్యలకు ఆదేశం

తహసీల్దార్‌పై దాడి ఘటనలో చర్యలకు ఆదేశం

అమలాపురం రూరల్‌: అయినవిల్లి తహసీల్దార్‌ సీహెచ్‌ నాగలక్ష్మమ్మపై జరిగిన దాడిని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు. తహసీల్దార్‌కు ఆయన ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై ఇలా దాడి జరగడం బాధాకరమని, నిందితుడిపై బీఎస్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కృష్ణారావును కలెక్టర్‌ ఆదేశించారు.

ఏపీ ఆర్‌ఎస్‌ఏ, ఏపీ జేఏసీ ఖండన

అయినవిల్లి తహసీల్దార్‌పై జరిగిన దాడిని ఏపీ ఆర్‌ఎస్‌ఏ, ఏపీ జేఏసీ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా చైర్మన్‌, అయినవిల్లి డిప్యూటీ తహసీల్దార్‌ డి.శ్రీనివాస్‌ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వ్యక్తికి అయినవిల్లి మండలంలో ఏ గ్రామంలోనూ వ్యవసాయ భూములు లేవని, అటువంటప్పుడు దాడి ఎందుకు చేశారన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడలని కలెక్టర్‌, జేసీని వారు కోరారు.

తహసీల్దార్‌పై దాడి అమానుషం

అమలాపురం రూరల్‌: అయినవిల్లి తహసీల్దార్‌ నాగలక్ష్మమ్మపై జరిగిన దాడిని రాష్ట్ర రెవెన్యూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ వీఎస్‌ దివాకర్‌ అధ్యక్షతన శుక్రవారం అమలాపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితునిపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అటెండర్‌, నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టుల ఖాళీలను గ్రామ సహాయకులతో భర్తీ చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement