
పర్యావరణ పరిరక్షణే మనకు రక్ష
రాయవరం: పర్యావరణాన్ని పరిరక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని జిల్లా విద్యా శాఖ అధికారులు అన్నారు. ఆ శాఖ ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురువారం నిర్వహించారు. పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నేషనల్ గ్రీన్కోర్ ఆధ్వర్యాన మొక్కలు నాటారు. జిల్లావ్యాప్తంగా 1,581 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొక్కలు నాటడంతో పాటు, పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ, ఉప విద్యాశాఖాధికారులు జి.సూర్యప్రకాష్, పి.రామలక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.