అన్నదానానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

అన్నదానానికి విరాళాలు

Jun 6 2025 12:16 AM | Updated on Jun 6 2025 12:16 AM

అన్నద

అన్నదానానికి విరాళాలు

కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవ, గోపాలస్వామి ఆలయంలో అన్నదాన పథకానికి గ్రామానికి చెందిన పేర్చెర్ల శాన్వితరాజు గురువారం రూ.50,116 విరాళం అందజేశారు. అలాగే, పేర్చెర్ల నాగ వెంకట అనిందిత్‌వర్మ రూ 10,116, పేర్చెర్ల భానురిధి రూ.5 వేలు, చెరుకునీడి ఉదయ్‌ కిషన్‌, హేమలత దంపతులు, కుమార్తెలు చోళ లతీక్ష, రిత్యశ్రీ (ఏలూరు) రూ.5,116 చొప్పున విరాళాలు సమర్పించారు.

రూ.2.50 లక్షల

వెండి గరగ సమర్పణ

మామిడికుదురు: పాశర్లపూడిలంక గ్రామ దేవత శ్రీ చింతాలమ్మ వారికి అదే గ్రామానికి చెందిన తెలగారెడ్డి రాధాకృష్ణ, కృష్ణవేణి, తెలగారెడ్డి వెంకట సాయిరామ కనకరాజు, స్పందన దంపతులు గురువారం రెండున్నర కిలోల వెండితో చేయించిన గరగను సమర్పించారు. దీని విలువ రూ.2.50 లక్షలని తెలిపారు. సంప్రోక్షణ అనంతరం, ప్రత్యేక పూజలు చేయించి గరగను అమ్మవారికి సమర్పించారు. దాతలను సర్పంచ్‌ తెలగారెడ్డి సూర్యప్రకాశరావు, కమిటీ సభ్యులు అభినందించారు.

డీఎస్సీ అభ్యర్థులకు

రిక్వెస్ట్‌ స్టాప్‌ల సదుపాయం

అమలాపురం రూరల్‌: డీఎస్సీ పరీక్షలు జరిగే భట్లపాలెం, చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలల వద్ద ఆర్టీసీ రిక్వెస్‌ స్టాప్‌లు ఏర్పాటు చేశామని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్‌టీపీ రాఘవ కుమార్‌ తెలిపారు. ఆయా రూట్లలో తిరిగే అన్ని బస్సులను ఆ కేంద్రాల వద్ద ఆపాలని అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం ఆర్టీసీ డిపోల అధికారులకు, ఉద్యోగులకు సూచనలిచ్చామని వివరించారు. రెండు కేంద్రాలను గురువారం సందర్శించామని తెలిపారు. ఈ మేరకు ఆ కేంద్రాల వద్ద రిక్వెస్ట్‌ స్టాపు బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు.

4 రోజుల పాటు

విద్యుత్‌ అంతరాయాలు

అమలాపురం రూరల్‌: జిల్లాలోని 132 కేవీ రామచంద్రపురం, కొత్తపేట, ముమ్మిడివరం డబుల్‌ సర్క్యూట్‌ లైన్లలో 30 టవర్లు పాడవగా.. ఇప్పటి వరకూ 23 టవర్లను తిరిగి ఏర్పాట చేశామని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ రాజబాబు, ట్రాన్స్‌కో ఈఈ శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ఏడు టవర్లను మార్చేందుకు శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం రూరల్‌, అల్లవరం, అయినవిల్లి, అంబాజీపేట, రాజోలు, మామిడికుదురు, పి.గన్నవరం, మలికిపురం, సఖినేటిపల్లి, కొత్తపేట, రావులపాలెం మండలాల్లో దశల వారీగా ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ విద్యుత్‌ అంతరాయాలు ఉంటాయని వారు వివరించారు.

అన్నదానానికి విరాళాలు 1
1/1

అన్నదానానికి విరాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement