
నేటి నుంచే డీఎస్సీ
ఏ రోజు ఏ పరీక్షంటే..
తేదీ సబ్జెక్టు
6 టీజీటీ గణితం (ఇంగ్లిషు మీడియం)
8 ఎస్ఏ హిందీ
9 ఎస్ఏ ఫిజిక్స్
10 ఎస్ఏ బయాలాజీ
11 ఫిజికల్ డైరెక్టర్
12 ఎస్ఏ గణితం
13 ఎస్ఏ ఇంగ్లిష్, ఎస్జీటీ
14 పీజీటీ బోటనీ, పీజీటీ పీఎస్, పీజీటీ
సోషల్ స్టడీస్ (ఇంగ్లిష్ మీడియం)
16, 17 ఎస్ఏ సోషల్ స్టడీస్
17, 18 ఎస్జీటీ
19 పీజీటీ బయోసైన్స్
(ఇంగ్లిష్ మీడియం), ఎస్జీటీ
20, 21 ఎస్జీటీ
22 టీజీటీ–తెలుగు, పీఈటీ–వీహెచ్
23, 24 ఇంగ్లిషు ప్రొఫిషియెన్సీ టెస్ట్
25 టీజీటీ–సైన్స్ (ఇంగ్లిషు మీడియం),
పీజీటీ హిందీ, టీజీటీ–సైన్స్
(ఇంగ్లిషు మీడియం)
26 టీజీటీ–ఇంగ్లిష్, పీఎస్
(ఇంగ్లిష్ మీడియం)
27 టీజీటీ సోషల్ స్టడీస్
(ఇంగ్లిష్ మీడియం)
28 పీజీటీ–ఇంగ్లిష్
29, 30 ఎస్ఏ తెలుగు
రాయవరం/అమలాపురం రూరల్: ఉపాధ్యాయ నియామకానికి నిర్వహిస్తున్న డీఎస్సీ–2025 పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకూ జరిగే ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) కావడంతో కంప్యూటర్ సౌకర్యాలున్న కేంద్రాలను ఈ పరీక్షలకు ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 11,795 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. జిల్లాలోని అమలాపురం రూరల్ భట్లపాలెంలోని బీవీసీ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ, కాట్రేనికోన మండలం చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఒక్కో కేంద్రంలో ఒక్కో సెషన్కు 170 మంది పరీక్షలు రాసే అవకాశముంది.
స్క్రైబ్స్కు అవకాశం
విజువల్లీ హ్యాండీక్యాప్డ్ (వీహెచ్), ఆర్థో హ్యాండీక్యాప్డ్ (ఏహెచ్) రెండు చేతులూ లేని వారికి స్క్రైబ్స్ను (సహాయకులు) ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు. ఇంటర్మీడియెట్ అర్హత కలిగిన వారిని స్క్రైబ్స్గా ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరమైన వివరాలు ఆయా సెంటర్లలో తెలియజేస్తారు. వీహెచ్లో స్క్రైబ్ వాడుకునే వారికి 50 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ఏహెచ్ వారికి అదనపు సమయం వర్తించే అవకాశం లేదు. అంగవైకల్యాన్ని పరిశీలించి, మెడికల్ బోర్డు (డీఎంహెచ్ఓ) జారీ చేసిన సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే స్క్రైబ్స్ ఏర్పాటు చేసే అవకాశముంది. హాల్ టికెట్పై ఫొటోగ్రాఫ్ లేని వారికి తాజా ఫొటోగ్రాఫ్పై గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన వాటిని పరీక్షలకు అనుమతిస్తారు. జిల్లాలో 18 మంది వీహెచ్, 8 మంది ఏహెచ్ అభ్యర్థులను గుర్తించినట్లు సమాచారం.
పకడ్బందీగా పరీక్షలు
రెండు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను ఎస్పీ బి.కృష్ణారావుతో కలసి జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి గురువారం పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్, విద్యా శాఖ, ఆర్టీసీ, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) డాక్టర్ షేక్ సలీం బాషా తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి అక్రమాలు, అవకతవకలకు తావులేని విధంగా ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నందున కంప్యూటర్లు, సాంకేతిక పరికరాల్లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా కళాశాల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య కన్నా పది శాతం కంప్యూటర్లను అదనంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక డిపార్ట్మెంటల్ అధికారి పర్యవేక్షిస్తూంటారు. అమలాపురం డీవైఈఓ జి.సూర్యప్రకాశం ఆధ్వర్యాన ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతుంది. అభ్యర్థులకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు డీఈఓ కార్యాలయంలో 98663 87500, కలెక్టరేట్లో 96664 37749 నంబర్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
·˘ hÌêÏÌZ Æð‡…yýl$ B¯ŒSOÌñ毌S MóS…{§éË$
·˘ ç³È„ýSË$ Æ>Ķæ$¯]l$¯]l² 11,795 Ð]l$…¨
గంట ముందుగానే చేరుకోవాలి
డీఎస్సీ అభ్యర్థులు నిర్ణీత సమయాని గంట ముందుగానే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. సెల్ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, అమలాపురం

నేటి నుంచే డీఎస్సీ