
నాడు అతివకు అందలం
సాక్షి, అమలాపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీ నెరవేర్చడంతో పాటు.. చెప్పనివి కూడా అమలు చేసి మహిళలను మహరాణులను చేసిన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిది కాగా.. అరచేతిలో వైకుంఠం చూపించి, అందలం ఎక్కిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయని అపఖ్యాతి నేటి కూటమి ప్రభుత్వానికే దక్కింది. జగన్ హయాంలో ప్రతి సంక్షేమ లబ్ధి మహిళలకే అందించారు. ఇళ్ల పట్టాలు, ఇళ్లు కూడా వారికే అందించారు. అదే సమయంలో స్థానిక సంస్థలతో పాటు నామినేటెడ్ పదవుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వారికి రాజ్యాధికారం దక్కేలా చేశారు. దీనికి భిన్నంగా ప్రస్తుత కూటమి సర్కారులో సంక్షేమ పథకాల అమలే లేకుండా పోయింది. మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.1,500, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలుకే నోచలేదు. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అరకొరగానే అమలవుతోంది.
వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానం కాదు. మేనిఫెస్టోలో కూడా చెప్పలేదు. పేదవాడు ఎక్కడున్నా.. పేదవాడే. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. ఒక మంచి అన్నగా, తమ్ముడిగా.. వారికి మంచి చేయాలనే బాధ్యత తీసుకున్నాను.
– నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (గతంలో అన్న మాటలివి)
ఫ అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేశారు. 2019–20 విద్యా సంవత్సరంలో 1,70,994 మందికి రూ.206.991 కోట్లు, 2020–21లో 1,44,797 మందికి రూ.217.196 కోట్లు, 2021–22లో 1,45,462 మందికి రూ.218.193 కోట్లు, 2022–23లో 1,45,462 మందికి రూ.218.193 కోట్ల చొప్పున అందజేశారు.
ఫ పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్, డీఎడ్, బీఎడ్ వంటి ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన అందించేవారు. సుమారు 29,878 మంది తల్లుల ఖాతాల్లో విడతకు రూ.25.80 కోట్ల వరకు అందించేవారు. ఇలా ఏటా మూడుసార్లు అందజేసేవారు. వసతి గృహాల్లో చదువుకున్న 9,591 మంది విద్యార్థులకు వసతి దీవెన సొమ్ము సైతం తల్లుల ఖాతాలకు జమ చేశారు.
ఫ స్వయం సహాయక సంఘాల్లోని (ఎస్హెచ్జీ) పొదుపు మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో స్వయంగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఏప్రిల్ 11వ తేదీ వరకూ ఉన్న ఎస్హెచ్జీ రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఆవిధంగా 2020 నవంబర్ 11న మొదటి విడత, 2021 అక్టోబర్ 7న రెండో విడత, 2023 మార్చి 25న మూడో విడత, 2024 మార్చి 23న నాలుగో విడత సొమ్ము చెల్లించారు. మొత్తం నాలుగు విడతలూ కలిపి మహిళా సంఘాలకు ఏకంగా రూ.1,015.96 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
ఫ ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీలు కాకుండా ఇతర అగ్రవర్ణాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు మహిళలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి చేకూర్చారు. వీరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈవిధంగా జిల్లాలోని 11,496 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.53.03 కోట్లు వేశారు.
ఫ మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేల చొప్పున వైఎస్సార్ సీపీ నేతన్న నేస్తం సొమ్ము అందించారు. దీని ద్వారా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 17,811 మందికి రూ.43.33 కోట్ల మేర లబ్ధి చేకూరింది. దీనివలన నేత కార్మికులు బయట అప్పులు చేయనవసరం లేకుండానే తమకు కావాల్సిన ముడి సరకు, రంగుల వంటివి కొనుగోలు చేసుకోగలిగారు.
ఫ ఆర్థికంగా వెనుకబడిన కాపు కుటుంబాలకు మేలు చేసేందుకు గత ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు అందజేసింది. ఈ పథకంలో జిల్లావ్యాప్తంగా 34,962 మంది మహిళలకు రూ.165.609 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
ఫ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్హెచ్జీల్లోని పేద మహిళల ఆర్థిక ఉన్నతికి గత ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. వారు తయారు చేస్తున్న ఉత్పత్తులను బహుళజాతి కంపెనీల ద్వారా విక్రయించడంతో పాటు, బ్యాంకుల ద్వారా సకాలంలో రుణాలిచ్చేలా చర్యలు చేపట్టింది. తొలి ఏడాది అమూల్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, అలానా వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. రెండో సంవత్సరం జియో – రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టీనేజర్, మహేంద్ర–ఖేతి వంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళల ఆర్థిక అభ్యున్నతికి దోహదపడింది.
ఫ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత గత సీఎం వైఎస్ జగన్కే దక్కింది. దీనివల్ల అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్లుగా మహిళలకు అవకాశం దక్కింది. మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ పదవుల్లో అతివలకు 50 శాతం అవకాశం వచ్చింది. దీంతో పాటు నామినేటెడ్ పదవుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. మార్కెట్ కమిటీలు, దేవస్థానాలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల పదవులలో సగానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చారు.
అమ్మ ఒడి ఇవ్వాలి
నాకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దవాడు 9వ తరగతి, రెండో వాడు ఏడో తరగతి చదువుతున్నారు. అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామన్నారు. ఒక ఏడాది గడిచిపోయి, రెండో ఏడాది వచ్చింది. రెండేళ్ల సొమ్మూ ఒకేసారి వేస్తే మా వంటి పేద కుటుంబాలకు మేలు చేసినట్లవుతుంది.
– గంటా అరుణకుమారి,
గొల్లపాలెం, మలికిపురం మండలం
అది చరిత్రాత్మక నిర్ణయం
నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది చరిత్రాత్మకం. అది వైఎస్ జగన్ వల్లనే సాధ్యమైంది. ఆ నిర్ణయం వల్ల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు, దేవస్థానాలు, ఇతర కార్పొరేషన్లలో మహిళలకు సమాన అవకాశాలు వచ్చాయి. గతంలో కేవలం సభ్యులుగా మాత్రమే ఒకరిద్దరు ఉండేవారు. ఇప్పుడు చైర్పర్సన్లు అవుతున్నారు.
– దంగేటి డోలామణి,
అమలాపురం మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్
ఫ కూటమి ఏడాది పాలనలో
మహిళల దరి చేరని సంక్షేమం
ఫ ప్రతి నెలా రూ.15 వందలెక్కడో!
ఫ కొంత మందికే ఉచిత గ్యాస్
ఫ ఆర్టీసీ ఉచిత ప్రయాణం బహుదూరం

నాడు అతివకు అందలం

నాడు అతివకు అందలం

నాడు అతివకు అందలం

నాడు అతివకు అందలం