
సర్కారు వారి వంచన
ఉద్యోగుల సమస్యలు
పరిష్కరించాలి
ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. ఇప్పటి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి.
– పి.నరేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం,
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా డీఏలను ప్రకటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెండింగ్ డీఏలు, బకాయిలపై పెదవి విప్పడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా నేటి వరకు పీఆర్సీ ప్రకటించకపోవడం దారుణం. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ, డీఏ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చినా, వాటిపై నోరు మెదపడం లేదు.
– పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఏదైనా సర్కస్కు వెళ్తే రింగ్ మాస్టర్..
తోలుబొమ్మలాటు వెళ్తే కేతిగాడు.. మరో ఆటలో జోకర్.. ఇలా వేదికను అనుసరించి వారి హాస్య చతురతతో ఆహూతులను, ప్రేక్షకులను ఓ గంటో.. రెండు గంటలపాటో అలరిస్తుంటారు. వారి మాయలో పడి వాస్తవాన్ని మరచి వెళ్లినవారంతా ఆ భ్రమలో పడిపోతారు. చివరాఖరుకు ఎండ్ బెల్ కొట్టగానే వారంతా మళ్లీ వాస్తవంలోకి వచ్చి ఓర్నీ ఎంత మాయ చేశార్రా అనుకుంటూ ఇంటిదారి పడతారు. ఇదిగో అలగే ఉంది కూటమి ప్రభుత్వం తీరు. ఎన్నికల వేళ అలవి కాని హామీలు ఎడాపెడా ఇచ్చేశారు. తన.. పర.. భేదం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారం ఇచ్చి చూడండి.. మిమ్మల్ని ఎక్కడ కూచోబెడతామో అంటూ నమ్మించారు. తీరా గద్దెనెక్కాక సేవకులు సేవలు చేయాలే కానీ హక్కుల గురించి మాట్లాడకూడదు.. హామీలను ప్రశ్నించకూడదన్నట్టు వ్యవహరిస్తున్నారు కూటమి నేతలు. తత్వం బోధపడ్డాక వివిధ వర్గాల ప్రజలతో పాటు తామూ మోసపోయామని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులంతా ఏకమై హామీల సాధనకు ఉద్యమించే యోచనలో ముందుకు వెళ్తున్నారు.
సాక్షి, అమలాపురం: రైతులు.. మహిళలు.. నిరుద్యోగులు.. మధ్య తరగతి ప్రజలు.. వీరే కాదు... కూటమి ఏడాది పాలనలో చివరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మోసపోయారు. అధికారంలోకి రాగానే ఆకర్షణీయమైన మధ్యంతర భృతి.. మెరుగైన పీఆర్సీ.. ఎప్పటి డీఏ అప్పుడే... అంతేకాదు ఉద్యోగాల కొరత తీర్చేందుకు మెగా డీఎస్సీ, గ్రూప్ సర్వీసులు, ఇతర పద్ధతుల్లో కొత్త ఉద్యోగాలు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ.. ఇవన్నీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీల తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు. ఏడాది కాలంలో ఏ ఒక్క హామీనీ వారు నెరవేర్చలేకపోయారు.
పీఆర్సీపై ఉలుకూపలుకూ లేదు
ఎన్నికల ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు హామీలు ఇచ్చారు. దీనిని నమ్మిన ఉద్యోగులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఏలపై ప్రకటన వస్తుందని, 12వ పీఆర్సీ ప్రకటిస్తారని, అది ఇచ్చేలోగా మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశించారు. ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తున్నా వాటి విషయం పట్టించుకోలేదు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ పెండింగ్ డీఏలు, పీఆర్సీ చైర్మన్ను నియమించి ఐఆర్ ప్రకటిస్తారని అందరూ ఆశించడం.. ఆ తరువాత నిరాశపడడం పరిపాటిగా మారింది. జిల్లాలో 18 వేల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని అంచనా. వీరితో పాటు 8,500 మంది వరకు సచివాలయ ఉద్యోగులున్నారు. సంక్రాంతి కానుకగానైనా ఇస్తారని, సంవత్సరాది కానుకగా అందిస్తారని ఆయా వర్గాలు ఆశించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. ఏడాదిగా ఎటువంటి ప్రకటనా రాకపోవడంతో అంతా డీలా పడ్డారు. పీఆర్సీ, ఐఆర్ అటుంచి ఇప్పటికే రెండు విడతల డీఏ బకాయిలు సైతం విడుదల కాలేదు.
కమిషన్ ఏర్పాటు ఎప్పుడు?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించారు. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. 2024 జూన్ 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాల్సి ఉంది. ఆ వెంటనే మధ్యంతర భృతిని అందించాల్సి వస్తుందనే ఈ నియామకం చేయలేదని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. 2014 ఎన్నికల తరువాత రాష్ట్ర విభజన జరగడం, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో తప్పని సరి పరిస్థితుల్లో చంద్రబాబు ఈ రాష్ట్రంలో కూడా 43 శాతం పీఆర్సీ ప్రకటించారు. అయితే బకాయిలు మాత్రం ఇవ్వలేదు. ఎన్నో విజ్ఞప్తులు, ఆందోళనలతో ఎట్టకేలకు 2016 అక్టోబర్ నుంచి సీపీఎస్ ఉద్యోగులకు మూడు విడతలుగా, రెగ్యులర్ ఉద్యోగులకు ఒక విడతగా పీఆర్సీ బకాయిలు చెల్లించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే బకాయిలు ఇచ్చారనే ఆరోపణలు కూడా అప్పట్లో విన్పించాయి. ఇప్పుడు కూడా అదే విధంగా 43 శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది.
నాడు స్థానికంగానే ఉద్యోగాల సృష్టి:
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో స్థానికంగానే ఉద్యోగాలు సృష్టించారు. గ్రామాల్లోని సచివాలయం రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల వంటివి ఏర్పాటు చేసి స్థానికంగానే ఉద్యోగ కల్పనకు కృషి చేశారు. వీటివల్ల కేవలం సచివాలయాల్లోనే 8500 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. పలు రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. రాజకీయ పార్టీల సిఫార్సుల మేరకు గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అర్హులైన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పించింది. దీనితో పాటు వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి జిల్లాలో 9900 మందికి పైగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి పొందే అవకాశాన్ని గత ప్రభుత్వం కల్పించింది.
ప్రభుత్వ ఉద్యోగులనూ వదలని పాలకులు
ఐఆర్.. పీఆర్సీ.. డీఏ బకాయిలు..
అన్నింటా మోసపూరిత హామీలు
నెరవేరని ఔట్ సోర్సింగ్
ఉద్యోగుల రెగ్యులరైజేషన్
వైఎస్సార్ సీపీ పాలనలో వేలల్లో
స్థానికంగా సర్కారీ కొలువులు
ఉద్యమాలకు సిద్ధమవుతున్న ఉద్యోగులు
ఆందోళన బాటలో ఉద్యోగ సంఘాలు
పీఆర్సీ ప్రకటించిన తర్వాత నివేదిక వచ్చే లోపు ఐఆర్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. పీఆర్సీ కమిషన్ను నియమించిన తర్వాత నివేదిక ఇవ్వడానికి సాధారణంగా ఏడాది సమయాన్ని ఇస్తారు. పీఆర్సీ కమిటీ నియామకం అయిన తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాల్సి ఉంటుంది. పీఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోగా ప్రకటించాల్సిన మధ్యంతర భృతి కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. మధ్యంతర భృతి ఇవ్వాల్సిందేనంటూ వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. ఆ ప్రకటన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
డీఏల పరిస్థితి ఏమిటి?
ప్రతి ఆరు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కరువు భత్యం ప్రకటిస్తోంది. దానిని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం రేషియో ప్రకారం డీఏ ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది జనవరి, జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు డీఏలను ఇవ్వాల్సి ఉంది. ఈ విధంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రెండు డీఏలను ప్రకటించాల్సి ఉంది. అటు పీఆర్సీలో కదలిక లేక, ఇటు మధ్యంతర భృతిపై ప్రకటన లేకపోవడానికి తోడు డీఏల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం నోరుమెదపక పోవడాన్ని చూసి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సచివాలయ సిబ్బంది ఆగ్రహంతో ఉన్నారు.
క్రమబద్ధీకరణ లేనట్టేనా?
జిల్లాలో ఔట్ సోర్సీంగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే బుట్టదాఖలు చేశారు. జిల్లాలో సుమారు ఐదు వేల మంది వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారని అంచనా. వీరిలో చాలా మంది పదిహేను ఏళ్లకు పైబడి విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఉన్నారు. వీరు తమ సర్వీసులను చూసి క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు కోరుతున్నారు.
పరీక్షలు సరే..
నియామకాలు ఎప్పుడు?
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చేసిన తొలి సంతాకాలలో ఒకటి మెగా డీఎస్సీ ఫైల్. తొలి సంతకం కార్యరూపం దాల్చడానికి ఏడాది సమయం పట్టింది. డీఎస్సీకి సంబంధించి పరీక్షల నిర్వహణ వాయిదాలపై వాయిదా వేసి ఎట్టకేలకు నిర్వహిస్తున్నారు. పరీక్షలైతే నిర్వహిస్తున్నారు కానీ నియామకాలు వెంటనే చేపడతారా అనే నమ్మకం అభ్యర్థులలో కలగకపోవడం గమనార్హం.

సర్కారు వారి వంచన

సర్కారు వారి వంచన

సర్కారు వారి వంచన

సర్కారు వారి వంచన

సర్కారు వారి వంచన