
ఫలిస్తున్న పంచ్తంత్రం!
మహిళా బాక్సర్లు
సత్తా చాటుతున్నారు
నేను 8 సంవత్సరాల నుంచి పిఠాపురంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నాను. నా దగ్గర 150 మంది 10 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న పురుషులు, మహిళలు ఉన్నారు. వారిలో మహిళా బాక్సర్లు 70 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకు 30 మంది మహిళా బాక్సర్లు రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 40 మంది జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. నలుగురు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకాలు సాధించారు. బాక్సింగ్ యుద్ధ కళ. బాక్సింగ్లో సబ్ జూనియర్, జూనియర్, యూత్, సీనియర్స్ మెన్ అండ్ వుమెన్ విభాగాలు ఉంటాయి. వయసును బట్టి బరువును బట్టి పోటీ ఉంటుంది. బాక్సింగ్ నేర్చుకుని పతకాలు సాధిస్తే విద్య, ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలికలు ఎక్కువగా ఈ క్రీడ పట్ల మక్కువ చూపుతున్నారు.
– పి.లక్ష్మణరావు,
బాక్సింగ్ కోచ్, పిఠాపురం
పిఠాపురం: నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచన వారిని క్రీడల వైపు అడుగులు వేసేలా చేసింది. ఈ ఆటకు ఆడవారెందుకు అనే క్రీడలోనే పట్టుదల వారిని బాక్సింగ్ వైపు నడిపించింది. రింగ్లోకి దిగితే పతకం ఖాయం అనే రీతిలో తమ ప్రతిభా పాటవాలను చూపిస్తున్నారు పిఠాపురానికి చెందిన మహిళా బాక్సర్లు. ఒలింపిక్ పతకాన్ని అందించడమే తమ లక్ష్యం అంటున్నారు వీరు. ఇటీవల భారత్ బాక్సింగ్లో దూసుకెళ్తోంది. ప్రపంచ చాంపియన్న్షిప్లతో పాటు ఆసియా, కామన్వెల్త్, అంతర్జాతీయ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. బాక్సింగ్లో టాప్ 5 దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా భారత మహిళలు ఆడిన 12 చాంపియన్ షిప్లలో 10 గోల్డ్ మెడళ్లతో సహా 39 పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ మెడల్స్ సాధించిన వారి జాబితాలో తదుపరి తమ పేరు నమోదు చేసుకుంటామంటున్నారు ఇక్కడి మహిళా బాక్సింగ్ క్రీడాకారులు.
రింగ్లోకి దిగితే పతకం రావాల్సిందే
సత్తా చాటుతున్న
పిఠాపురం మహిళా బాక్సర్లు

ఫలిస్తున్న పంచ్తంత్రం!

ఫలిస్తున్న పంచ్తంత్రం!

ఫలిస్తున్న పంచ్తంత్రం!