ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

Jun 4 2025 12:48 AM | Updated on Jun 4 2025 12:48 AM

ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

మాజీ మంత్రి ఆర్కేరోజా

నగరి : వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి ఆర్కేరోజా పిలుపునిచ్చారు. మంగళవారం తన నివాసంలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు, నియోజకవర్గ, మున్సిపల్‌, పార్టీ మండల కమిటీల కార్యవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కోఆప్సన్‌ సభ్యులు, నాయకులతో సమావేశమైన ఆమె బుధవారం చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సూపర్‌ సిక్స్‌ పేరిట హామీలు ఇచ్చి ఏడాది పూర్తయినా ఏదీ పాలక ప్రభుత్వం చెయ్యలేకపోయిందన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. గతంలో మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథంలా ఉంటే నేడు అది చిత్తు కాగితంలా మారిందన్నారు. ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీ, అనుబంధ కమిటీల సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement