
నేటి నుంచి గోవిందుడి బ్రహ్మోత్సవాలు
ఉత్సవాల ఆరంభం సందర్భంగా సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తున్న అర్చకులు, అధికారులు
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో ఈనెల 2వ తేదీ సోమవారం నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం 5.30 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ వీఆర్.శాంతి, ఏఈఓ కె.మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ ధనుంజయరావు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 7.02 నుంచి 7.20 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగనున్నాయి.

నేటి నుంచి గోవిందుడి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి గోవిందుడి బ్రహ్మోత్సవాలు