
విశ్వం విద్యార్థుల ప్రభంజనం
తిరుపతి కల్చరల్: జాతీయ స్థాయిలో గత నెల ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ 9వ తరగతి విభాగంలో 400 మార్కుల కు 370 మార్కులు సాధించి వి.మోక్షిత్ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు కై వశం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. అలాగే 6వ తరగతి విభాగంలో 300 మార్కుల కు 281 మార్కులతో హృతిక్ రాయల్, 275 మార్కుతో వి.నిహార్, 270 మార్కులతో సోహిని అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. వీరితో పాటు రస జ్ఞ, జీవన్ సాయిరెడ్డి, ఆర్యన్రెడ్డి, భువనేష్, లోహిత్, మహిదర్, అశ్విన్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో అత్యుత్తమ మార్కులు సాధించారని తెలిపారు. అలాగే గణితంలో 50/50 మార్కులు విశ్వం విద్యాసంస్థల విద్యార్థులు సాధించడం రాష్ట్ర విద్యాశాఖకే గర్వకారణమన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విశ్వం విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వంచందన్రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.