తాగునీరు.. తాగ లేరు! | - | Sakshi
Sakshi News home page

తాగునీరు.. తాగ లేరు!

May 2 2025 1:49 AM | Updated on May 2 2025 1:49 AM

తాగునీరు.. తాగ లేరు!

తాగునీరు.. తాగ లేరు!

● జలం..గరళం ● కొళాయిల్లో కలుషిత నీరు

నగరి : మున్సిపల్‌ ప్రజలకు మున్సిపాలిటీ వారు సరఫరా చేసే తాగునీరు గురువారం ఏకాంబరకుప్పం పరిధిలో రంగు మారి పింక్‌ కలర్‌లో రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ నీటిని ఎలా వాడాలంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా డైయింగ్‌ ఫ్యాక్టరీల నుంచి వచ్చే హానికర రసాయన రంగునీటి కారణంగా ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. దీంతో బోర్లలో వచ్చే నీరు తాగడానికి వీలుపడదు. మున్సిపాలిటీ వారు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నుంచి సరఫరా చేసే నీరే అందరూ వినియోగించుకుంటున్నారు. అయితే కొళాయిల్లో వచ్చే నీరు కూడా రసాయన రంగుల్లో వస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చేసేదేమీలేక... ప్రైవేటు వాటర్‌ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement