లాభాలతో దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,500 | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

లాభాలతో దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,500

Jun 18 2024 9:33 AM | Updated on Jun 18 2024 10:14 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 23,513కు చేరింది. సెన్సెక్స్‌ 138 పాయింట్లు ఎగబాకి 77,131 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.55 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.6 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.22 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.77 శాతం, నాస్‌డాక్‌ 0.95 శాతం  లాభాల్లోకి చేరాయి.

ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరిగే ఈ వారం మార్కెట్లో స్థిరీకరణ (కన్సాలిడేషన్‌) అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరలు, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వచ్చేవారం రోజుల్లో 3 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇందులో డీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్, ఆమ్కే ఫిన్‌ ట్రేడ్‌ పబ్లిక్‌ ఇష్యూలు జూన్‌ 19న, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ ఐపీఓ జూన్‌ 21న ప్రారంభం కానున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement