పురుగుల మందు తాగి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి ఆత్మహత్య

Jun 6 2025 6:03 AM | Updated on Jun 6 2025 6:03 AM

పురుగ

పురుగుల మందు తాగి ఆత్మహత్య

అశ్వారావుపేటరూరల్‌: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఆసుపాక గ్రామానికి చెందిన వీర్నాల సత్యనారాయణ(27) గతకొద్ది నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈక్రమంలో బుధవారం ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆయన గురువారం ఉదయం గుమ్మడవల్లి గ్రామ సమీపంలోగల పెదవాగు ప్రాజెక్టు ఆనకట్టపై విగతజీవిగా మారాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు.కాగా, మృతుడు మూడు నెలల క్రితమే సొంతింటిని నిర్మించుకోగా.. అప్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య 1
1/1

పురుగుల మందు తాగి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement