
మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్నాం
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు మూడు నెలల సన్నబియ్యాన్ని ముందుగానే పంపిణీ చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి రుక్మిణీ దేవి తెలిపారు. జిల్లాలోని పలు రేషన్ దుకాణాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్డుదారులకు అవసరమైన 17,287 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక దుకాణాలకు దఫాల వారీగా తరలిస్తున్నామని చెప్పారు. ఈనెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ ఉంటుందని, డీలర్లు సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లాలోని 443 రేషన్ షాపుల్లో ఇప్పటివరకు 32,488 మంది కార్డుదారులు బియ్యం తీసుకున్నారని వివరించారు.