
అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు
చుంచుపల్లి: పోడు పేరుతో అటవీ భూముల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ అధికారి యు.కోటేశ్వరావు హెచ్చరించారు. సోమవారం డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామవరం రేంజ్ పరిధిలోని జగ్గారం, గడ్డిగుట్ట, పాలవాగు ప్రాంతాల్లో కొందరు గొత్తి కోయలు అటవీ భూములను ఆక్రమించుకుంటున్నారని, పర్యవేక్షణకు వెళ్తున్న అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడగా 18 మందిపై కొత్తగూడెం టూటౌన్ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు. జగ్గారానికి చెందిన 34 మంది సుమారు 348 ఎకరాల వరకు అటవీ భూములను ఆక్రమించుకున్నారని, వారందరికీ నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. సమావేశంలో అటవీ రేంజ్ అధికారులు వి.శ్రీనివాసరావు, సీహెచ్.శ్రీనివాస్, డీఆర్వోలు తోలెం వెంకటేశ్వర్లు, మదన్ సిబ్బంది జి.రాము,బి. కళ్యాణి, ప్రసాద్, ఫిరోజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరరావు