
నేటి నుంచి ఫౌండేషన్ విత్తనాల పంపిణీ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని 23 మండలాల్లో ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున రైతులను ఎంపిక చేసి సోమవారం నుంచి వరి, పెసర ఫౌండేషన్ సీడ్ (పునాది విత్తనం) పంపిణీ చేయనున్నట్లు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె వివరాలు వెల్లడించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
‘ఈ దేశ మూలవాసులం మనమే..’
ఖమ్మం మామిళ్లగూడెం: ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కాక మతం మార్చుకున్న ముస్లిం మైనార్టీలు కూడా ఈ దేశ మూలవాసులేనన్న అంశం శాసీ్త్రయంగా నిరూపితమైందని బామ్సెఫ్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా శ్రీధర్ తెలిపారు. సంఖ్యాపరంగా అధిక సంఖ్యలోనే ఉన్నా బానిసలుగా, బాధితులుగా మిగిలిపోవడంతో విద్య నుండి దూరమయ్యామని చెప్పారు. ఖమ్మం టీటీడీసీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇతర దేశాల నుండి వలస వచ్చిన ఆర్యులు ఇక్కడి జీవన విధానం, నాగరికతను ధ్వంసం చేసి ఎవరూ తిరగబడకుండా కుల వ్యవస్థ, మనుధర్మాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అందరూ చరిత్రను చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయకుమారి మాట్లాడుతూ సీ్త్రలకు విలువలు లేని మనుధర్మ శాస్త్రం, కులాన్ని రుద్దడం ద్వారా రాజ్యాధికారానికి దూరం చేశారని తెలిపారు. తొలుత సామాజిక ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ సంఘాల నాయకులు కొండా పెద్దన్న, భూక్యా ఉపేంద్రబాయి, షేక్ నజీమా, ప్రమీల, త్రివేణి, భవాని, సరోజని, బానోతు భద్రునాయక్, మీగడ రామారావు, రవి, సోమ్లా, సంజీవరావు, పి.నాగేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు.

నేటి నుంచి ఫౌండేషన్ విత్తనాల పంపిణీ