3వ తేదీ వరకు పుస్తకాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

3వ తేదీ వరకు పుస్తకాల పంపిణీ

Jun 1 2025 12:19 AM | Updated on Jun 1 2025 12:19 AM

3వ తేదీ వరకు పుస్తకాల పంపిణీ

3వ తేదీ వరకు పుస్తకాల పంపిణీ

డీఈఓ వెంకటేశ్వరా చారి

కొత్తగూడెంఅర్బన్‌: ఈ ఏడాది పాఠశాలల పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ఈనెల 3వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరా చారి తెలిపారు. శనివారం పాత కొత్తగూడెంలోని గోదాం నుంచి రెసిడెన్షియల్‌ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 5,08,400 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4,54,925 పుస్తకాలు చేరాయని వివరించారు. ఇప్పటికే 59 శాతం పుస్తకాలను పంపిణీ చేశామని, మిగితావి రెండు రోజల్లో చేరవేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాళ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement