
ఇంకుడు గుంతలు నిర్మించాలి
గుండాల: వర్షపు నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి అన్నారు. గురువారం ఆమె పలు పంచాయతీ కేంద్రాల్లో నర్సరీలను, ఇంకుడు గుంతలను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అన్ని గ్రామాల్లో ఇంకుడు గుంతలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ శ్యాం సుందర్రెడ్డి, ఏపీఓ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
పూర్తి చేయాలి
దుమ్ముగూడెం : పంచాయతీల్లో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని డీపీఓ చంద్రమౌళి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని దుమ్ముగూడెం, లక్ష్మీనగరం పంచాయతీల్లోని పల్లె ప్రకృతి వనాలను, ఇంకుడు గుంతల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ పంచాయతీలో 100 ఇంకుడు గుంతలను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎంపీఓ బద్ది రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి