తాడేపల్లిలో రామ్‌రాజ్‌ షోరూం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తాడేపల్లిలో రామ్‌రాజ్‌ షోరూం ప్రారంభం

Jun 9 2025 10:16 AM | Updated on Jun 9 2025 10:16 AM

తాడేప

తాడేపల్లిలో రామ్‌రాజ్‌ షోరూం ప్రారంభం

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఆదివారం రామ్‌రాజ్‌ కాటన్‌ షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వహిందూ పరిషత్‌ జాతీయ ధర్మకర్త, పారిశ్రామికవేత్త డాక్టర్‌ పుట్టగుంట వెంకట సతీష్‌కుమార్‌ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ రామ్‌రాజ్‌ కాటన్‌ దుస్తులు ఉత్పత్తి చేయడం చాలా ఆనందించ దగ్గ విషయమని, నాణ్యతా ప్రమాణాల్లో ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని, మన తాడేపల్లిలో ఇలాంటి షోరూం ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయ దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్‌), శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కె.ఎస్‌.రామారావు, బక్షి మోటార్స్‌ ల్యాండ్‌ లార్డ్‌ సత్ప్రీత్‌ సింగ్‌ లాంబా, రామ్‌రాజ్‌ కాటన్‌ వ్యవస్థాపకులు కె.ఆర్‌.నాగరాజన్‌ పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనాలు ఢీ : వ్యక్తి మృతి

ముగ్గురికి గాయాలు

దుగ్గిరాల: ఎదురెదురుగా వస్తున్న ద్వి చక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం చిలువూరు దగ్గర సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమర్తలూరు మండలం, ప్యాపర్రు గ్రామానికి చెందిన కొల్లూరి వీరాంజనేయులు(35) గుంటూరులో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గుంటూరు వెళ్లి తిరిగి వస్తుండగా దుగ్గిరాల మండలం చిలువూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీకొంది. ఘటనలో వీరాంజనేయులు తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై తీవ్రంగా గాయపడిన రాయపూడి డేవిడ్‌ను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు, మరో ఇద్దరు క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని మంగళగిరి ఎయిమ్స్‌కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

శ్రష్టి వర్మపై ‘మా’ అధ్యక్షుడికి ఫిర్యాదు

లక్ష్మీపురం: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన దేశ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్‌ కరీం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. గుంటూరు నగరంలోని శనివారం జరిగిన కన్నప్ప ప్రీ రిలీజ్‌ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి విచ్చేసిన మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసిన కరీం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ సినీ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శ్రష్టి వర్మ జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూలను కించపరుస్తూ మాట్లాడారన్నారు. స్టార్‌ హీరోలను సైతం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న ఆయన పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన మంచు విష్ణు విచారించి, ఏడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

తాడేపల్లిలో రామ్‌రాజ్‌ షోరూం ప్రారంభం 1
1/2

తాడేపల్లిలో రామ్‌రాజ్‌ షోరూం ప్రారంభం

తాడేపల్లిలో రామ్‌రాజ్‌ షోరూం ప్రారంభం 2
2/2

తాడేపల్లిలో రామ్‌రాజ్‌ షోరూం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement