ప్రహరీ కూలి మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ప్రహరీ కూలి మహిళ దుర్మరణం

Jun 9 2025 10:16 AM | Updated on Jun 9 2025 10:16 AM

ప్రహర

ప్రహరీ కూలి మహిళ దుర్మరణం

చీరాల రూరల్‌: ప్రహరీ కూలి మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం చీరాల మరియమ్మపేటలో చోటు చేసుకుంది. అందిన వివరాల మేరకు.. ఆండ్ర ఆనందరావు, రోజ్‌మేరీ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆదివారం సుమారు 11:30 గంటల సమయంలో మేళం హనుమంతరావు తన ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నాడు. పక్కనే నివాసముంటున్న ఆండ్ర ఆనందరావు, రోజ్‌మేరీలు ప్రహరీ పక్కన ఉన్న తమ సామాన్లు సర్దుకుంటున్నారు. ఇంతలోనే పక్కనే ఉన్న ప్రహరీ అకస్మాత్తుగా భారీ శబ్దంతో కూలిపోయింది. పక్కనే ఉన్న రోజ్‌మేరీ గోడకింద పడటంతో మృతి చెందింది. ఆమె భర్త ఆనందరావుకు తల పగిలి, కాలుకు గాయాలయ్యాయి. స్థానికులు శిథిలాలను తొలగించి ఇద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోజ్‌మేరీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ నాగభూషణం తెలిపారు. రోజ్‌ మేరీ మృతితో మరియమ్మపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో ఎంతో కలివిడిగా ఉండే ఆమె మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు

చేస్తున్న పోలీసులు

ప్రహరీ కూలి మహిళ దుర్మరణం 1
1/2

ప్రహరీ కూలి మహిళ దుర్మరణం

ప్రహరీ కూలి మహిళ దుర్మరణం 2
2/2

ప్రహరీ కూలి మహిళ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement