స్నేహమేరా జీవితం.. శాశ్వతం! | - | Sakshi
Sakshi News home page

స్నేహమేరా జీవితం.. శాశ్వతం!

Jun 8 2025 1:17 AM | Updated on Jun 8 2025 1:55 AM

స్నేహమేరా జీవితం.. శాశ్వతం!

స్నేహమేరా జీవితం.. శాశ్వతం!

శావల్యాపురం: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలో 2004–2005 పదో తరగతి పూర్వ విద్యార్థులు బ్యాచ్‌ అత్మీయ సమ్మేళనం కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత తమ గురువులను పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికిన అనంతరం తాము చదువుకున్న స్కూల్లో 20 సంవత్సరాల తర్వాత అందరిని కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు అత్మీయంగా పలకరించుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను తరగతి గదుల్లో తీపి గుర్తులు మాట్లాడుకున్నారు. తమ గురువులు నేర్పిన విద్య ద్వారా ఈస్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు యర్రం హనుమంతరావు మాట్లాడుతూ తమ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదిగి ఐక్యంగా గురువులను గౌరవించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు యర్రం హనుమంతరావు, సి.హెచ్‌. చంద్రశేఖర్‌, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కె.జె.రమేష్‌, ఆర్‌కె.రమేష్‌ తదితరులను ఘనంగా పూలమాలలు దుశ్శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గుత్తా వెంకటరావు, పాలడుగు శ్రీను, తులబందుల రమ్య, చిలంకూరి నాగలక్ష్మి, జవంగుల నాగరాజు, పరమేశ్వరరావు, యలవర్తి శిరీషా, పాలడుగు సాయి. 45 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

శావల్యాపురం జడ్పీ హైస్కూల్‌ 2003–2004 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement