పుష్కర ఘాట్‌ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్‌ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

Jun 8 2025 1:17 AM | Updated on Jun 8 2025 1:55 AM

పుష్కర ఘాట్‌ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

పుష్కర ఘాట్‌ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణానది దిగువ ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్‌లో గుర్తుతెలియని మృతదేహం చెట్టుకు వేలాడుతూ మెట్లపై పడిపోయి వున్న స్థితిలో స్థానికులు గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి మెడకు ఉరి వేసుకుని వున్న లుంగీ, కండువాను తొలగించి మృతదేహాన్ని పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. లుంగీ, కండువా కలిపి కట్టుకుని ఉరి వేసుకుని ఉంటాడని ఎస్‌ఐ శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు మాత్రం కృష్ణానది తీరంలోని పుష్కర ఘాట్‌లలో, ఇసుక తిన్నెల్లో అనేక అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని, చాలా మందిని కొట్టి డబ్బులు, వస్తువులు లాక్కుని పారిపోయిన సంఘటనలు ఉన్నాయని, ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చిన వ్యక్తిని ఎవరో కొట్టి చంపి చెట్టుకు వేలాడి తీసి ఉంటారని అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement