
పవర్ లిఫ్టింగ్లో జిల్లాకు చాంపియన్షిప్
సత్తెనపల్లి: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పల్నాడు జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపి జూనియర్ మెన్ టీం ఛాంపియన్షిప్ సాధించింది. ఒంగోలు లోని డాక్టర్ పి.ఆనంద్ స్టేడియంలో 12వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు గత నెల 31 నుంచి ఈ నెల 2 వరకు మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్– బెంచ్ ప్రెస్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ మెన్, ఉమెన్ పోటీలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ పోటీలలో పల్నాడు జిల్లాకు చెందిన 8 మంది క్రీడాకారులు 10 బంగారం, 3 రజత, 2 బ్రొంజ్ పతకాలను మొత్తంగా 15 పతకాలను కై వసం చేసుకొన్నారు. జిల్లా ప్రతిష్టను చాటడమేగాక జిల్లా జూనియర్ మెన్ టీం చాంపియన్ షిప్ మొదటి స్థానం సాధించింది. సబ్ జూనియర్స్లో 47 కేజీల విభాగంలో గురజాలకు చెందిన కె.పల్లవి (సిల్వర్ మెడల్), 66 కేజీల విభాగంలో సత్తెనపల్లికి చెందిన ఎం.వినయ్ వెంకట శివ (సిల్వర్ మెడల్), జూనియర్–సీనియర్ మెన్ విభాగంలో 74 కేజీల విభాగంలో వెన్నా దేవీకి చెందిన శరత్ 2 బంగారు పతకాలు, 74 కేజీ విభాగంలో కంకణాలపల్లికి చెందిన రమేష్ చౌదరి బ్రాంచ్ మెడల్, 83 కిలోల విభాగంలో సత్తెనపల్లికి చెందిన పసుపులేటి వంశీ కృష్ణ 3 బంగారు పతకాలు, ఒక రజిత పతకం, 120 కేజీల విభాగంలో గుడిపూడికి చెందిన లింగిసెట్టి శివ నాగేశ్వర రావు నాలుగు బంగారు పతకాలు, సబ్ జూనియర్ మెన్ బెంచ్ ప్రెస్ విభాగంలో 53 కిలోల విభాగంలో గురజాలకు చెందిన కె కార్తీక్ సిల్వర్ పతకం,74 కిలోల విభాగంలో సత్తెనపల్లికి చెందిన షేక్ మొహిద్దీన్ బంగారు పతకం సాధించారు. శరత్ (వెన్నాదేవీ), పసుపులేటి వంశీకృష్ణ రెండు, మూడవ స్థానాల్లో రాష్ట్రస్థాయిలో జూనియర్ స్ట్రాంగ్ మెన్టైటిల్ సంపాదించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను పల్నాడు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ, అంతర్జాతీయ క్రీడాకారుడైన పసుపులేటి సురేష్, పల్నాడు జిల్లా పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ జిమ్రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివ రావు, కత్తి పవన్, మాతంగి రాహూల్ గౌతమ్, జి రమేష్, శాంతయ్య శుక్రవారం క్రీడాకారులను అభినందించారు.
ప్రతిభ చూపిన జూనియర్ మెన్ క్రీడాకారులు