ఇసుక తోడేళ్లు | - | Sakshi
Sakshi News home page

ఇసుక తోడేళ్లు

Jun 7 2025 1:45 AM | Updated on Jun 7 2025 1:45 AM

ఇసుక

ఇసుక తోడేళ్లు

బాపట్ల

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

నగరంపాలెం: లాలాపేట శ్రీ పద్మావతి ఆండాళ్‌ సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. స్వామి వారిని పెళ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు.

క్యూఆర్‌ కోడ్‌ బోర్డులు ఏర్పాటు

విజయపురిసౌత్‌: పర్యాటక కేంద్రం నాగార్జున కొండలో క్యూ ఆర్‌ కోడ్‌ బోర్డులను ఏర్పాటు చేసినట్లు నాగార్జునకొండ కన్జర్వేటివ్‌ అసిస్టెంట్‌ వెంకటయ్య తెలిపారు.

ప్రసన్నాంజనేయుడికి అభిషేకాలు

ఫిరంగిపురం: వేమవరంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయ 21వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు.

శనివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2025

చీరాల టౌన్‌: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు ఇసుక దిబ్బలను యథేచ్ఛగా తోడేసుకుని భూముల్లో చదును చేసుకుంటున్నారు. చీరాల ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మాఫియా చెలరేగిపోతోంది. ఒకవైపు ఇసుక దిబ్బలు, మరోవైపు తీరం అంచును యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మండలంలోని గవినివారిపాలెం పంచాయతీ పరిధి విజయలక్ష్మీపురం తీర గ్రామాల్లో ఇలా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు.

అధికారమే అండగా..

విజయలక్ష్మీపురం గ్రామంలో సీ మౌత్‌ను మూసేసి గుంటూరుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే భర్త, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వేస్తున్న వెంచర్‌ చదునుకు, ఇతర వ్యాపార అవసరాలకు సముద్రపు ఇసుకను ట్రాక్టర్లు ద్వారా రవాణా చేస్తున్నారు. ఇసుక దిబ్బలు కనుమరగుతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల రూరల్‌ మండలానికి చెందిన తీర ప్రాంతం నుంచి కూడా సముద్రపు ఇసుకను తరలిస్తున్నారు.

కన్నెత్తి చూడని యంత్రాంగం

చట్టవిరుద్ధంగా రోజుకు రూ.లక్షల విలువైన ఇసుకను రవాణా చేస్తున్నప్పటికీ మాఫియా నుంచి మామూళ్లు తీసుకున్నందునే అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖాధికారుల తీరుపై అంతా మండిపడుతున్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజల క్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.

అడ్డుకున్న గ్రామ ప్రజలు

తీరంలో ఇసుక దిబ్బలను యథేచ్ఛగా తవ్వుతుండటంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. కానీ మళ్లీ మాఫియా చెలరేగుతుండటంతో ఫలితం లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీర ప్రాంతాన్ని పంచుకుని తింటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లేకుంటే తీరప్రాంత గ్రామాల్లోని తాము చాలా నష్టపోతాయని చెబుతున్నారు. తమకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మాఫియాకు అండగా నిలిచినట్లు ప్రవర్తిస్తున్నట్లు ఆరోపించారు.

సముద్రం ఉగ్రరూపం దాల్చి అలలు ఎగసి పడినప్పుడు ఇసుక దిబ్బలు వాటికి అడ్డుకట్ట వేస్తాయి. తీరప్రాంత గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా కాపాడుతాయి. అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్న ఇసుక మాఫియా దెబ్బకు ఇక్కడి దిబ్బలు కనుమరుగైపోతున్నాయి. దీంతో ఇక్కడి గ్రామాల ప్రజలకు పెను ముప్పు తప్పేలా లేదు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు.

9

న్యూస్‌రీల్‌

మా పరిధిలోనిది కాదు

ఈ విషయమై చీరాల తహసీల్దార్‌ గోపికృష్ణను వివరణ అడుగగా.. బాపట్ల మండలంలోని అడవి పంచాయతీ తీరప్రాంతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. వీఆర్వోను పంపించి వివరాలు సేకరించామని పేర్కొన్నారు. ఇది బాపట్ల తహసీల్దార్‌ పరిధిలోకి వస్తుందని వివరించారు.

– కె.గోపికృష్ణ, తహసీల్దార్‌

మాఫియా దెబ్బకు సముద్ర తీరంలో

ఇసుక దిబ్బలు మాయం

మామూళ్ల మత్తులో అఽధికార

యంత్రాంగం మునిగిందని ఆరోపణలు

తీర ప్రాంత గ్రామాల ప్రజలకు

పొంచి ఉన్న పెను ముప్పు

ఇసుక తోడేళ్లు 1
1/6

ఇసుక తోడేళ్లు

ఇసుక తోడేళ్లు 2
2/6

ఇసుక తోడేళ్లు

ఇసుక తోడేళ్లు 3
3/6

ఇసుక తోడేళ్లు

ఇసుక తోడేళ్లు 4
4/6

ఇసుక తోడేళ్లు

ఇసుక తోడేళ్లు 5
5/6

ఇసుక తోడేళ్లు

ఇసుక తోడేళ్లు 6
6/6

ఇసుక తోడేళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement