యోగాతో ఆరోగ్యం మెరుగు | - | Sakshi
Sakshi News home page

యోగాతో ఆరోగ్యం మెరుగు

Jun 7 2025 1:45 AM | Updated on Jun 7 2025 1:45 AM

యోగాత

యోగాతో ఆరోగ్యం మెరుగు

బాపట్ల: యోగా వలన ఆరోగ్యం, మానసిక సమతుల్యత మెరుగు పడతాయని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి తెలిపారు. శుక్రవారం యోగాంధ్రలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలం నగరవనంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జె. వెంకట మురళి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో రూపొందించిన ప్రక్రియ అని తెలిపారు. దయనందిన జీవితంలో సాధన చేస్తే శరీరం ఆరోగ్యంగా, మానసిక స్థితి సమతుల్యతతో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.గంగాధర్‌ గౌడ్‌, డీఆర్‌డీఏ పి.డి. శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ విజయమ్మ, జిల్లా ఆయుష్‌ అధికారి డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్‌ అధికారి గ్లోరియా, జిల్లా అధికారులు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

పొగాకు గిడ్డంగుల పరిశీలన

పర్చూరు(చినగంజాం): పర్చూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఉన్న పొగాకు గిడ్డంగులను మార్క్‌ఫెడ్‌ ఎండీ మంజీర్‌ జిలానీ శుక్రవారం పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక పేరుకుపోయిన నిల్వలను కొనే దిక్కులేని పరిస్థితిలో రైతులు ఆందోళన చేపట్టడంతో యంత్రాంగం స్పందించింది. పొగాకును ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన యార్డును పరిశీలించారు. బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, పర్చూరు తహసీల్దార్‌ బ్రహ్మయ్య, అధికారులు, రైతు నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

యోగాతో ఆరోగ్యం మెరుగు 1
1/1

యోగాతో ఆరోగ్యం మెరుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement