కానిస్టేబుల్‌కు జాతీయస్థాయిలో రజత పతకం | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌కు జాతీయస్థాయిలో రజత పతకం

Jun 5 2025 8:00 AM | Updated on Jun 5 2025 8:00 AM

కానిస్టేబుల్‌కు జాతీయస్థాయిలో రజత పతకం

కానిస్టేబుల్‌కు జాతీయస్థాయిలో రజత పతకం

అభినందించిన ఎస్పీ తుషార్‌డూడీ

బాపట్లటౌన్‌: పట్టుదలతో పోరాడినప్పుడే విజయాలు మన సొంతమవుతాయని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. కర్లపాలెం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే వీరంకి నరేంద్ర 13వ జాతీయ స్థాయి పెన్‌ కాక్‌ సిలాట్‌ చాంపియన్‌ షిప్‌–2025లో రజత పతకం సాధించారు. కానిస్టేబుల్‌ను బుధవారం ఎస్పీ తుషార్‌డూడీ అభినందించారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ 2025 మే 9 నుంచి 12వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లక్నో నగరంలో కేడీ సింగ్‌బాబు స్టేడియంలో జరిగిన 13వ జాతీయ స్థాయి పెన్‌కాక్‌ సిలాట్‌ చాంపియన్‌ షిప్‌–2025 లో వీరంకి నరేంద్ర సత్తా చాటి రజత పతకం గెలుపొందారన్నారు. క్రీడలలో సత్తా చాటి జిల్లా పోలీస్‌ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేస్తూ పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. గతంలో కూడా జాతీయ స్థాయిలో రెండు మెడల్స్‌ సాధించాడని, 2024లో జరిగిన సెకండ్‌ ఆల్‌ ఇండియా పెన్‌కాక్‌ సిలాట్‌ చాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకం, 2018లో 3వ ఆల్‌ ఇండియా పోలీస్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడన్నారు. రాబోయే రోజుల్లో మంచి తర్ఫీదు పొంది అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఎస్పీ ఆకాక్షించారు. జిల్లా పోలీస్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది క్రీడల్లో పాల్గొనాలన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచినవారిని ప్రోత్సహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement