
తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత
అచ్చంపేట: ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన బాలుడిని సామాజికవేత్త షేక్ కమల్సైదా బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. అచ్చంపేట ఎస్సీ కాలనీకి చెందిన సందెపోగు వివేక్ గత 29న గుంటూరు వెళ్లి రైల్వేస్టేషన్లో రైలు ఎక్కి మహారాష్ట్రలోని జనగావ్ జిల్లా స్టేషన్ పోలీసులకు చిక్కినట్లుగా కమల్సైదా సమాచారం తెలుసుకున్నారు. మహారాష్ట్రలోని పోలీస్ వారితో మాట్లాడి వివేక్ పల్నాడు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందినవాడిగా సమాచారం అందించారు. తిరిగి అచ్చంపేటకు రప్పించారు. గత వారం రోజులుగా కుమారుడి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు అతడిని అప్పగించడంతో ఆనందపడ్డారు. దీనిపై పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బీరువాల సైదా తదితరులున్నారు.