
లోక్అదాలత్లో అధిక కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాల
రేపల్లె: లోక్ అదాలత్లో అధిక కేసులు పరిష్కారం అయ్యేలా పోలీసులు కృషి చేయాలని మండల న్యాయాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల కోరారు. జులై 5వ తేదీన జరగనున్న జాతీయ లోక్అదాలత్లో అత్యధిక కేసుల పరిష్కారం కోసం సోమవారం స్థానిక కోర్టు హాలులో డివిజన్ పరిధిలోని పోలీసులు, న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలన్న లక్ష్యంతో న్యాయశాఖ లోక్ అదాలత్తో పాటు ప్రతి నెలా జాతీయ లోక్అదాలత్ను నిర్వహిస్తోందని వివరించారు. డివిజన్ పరిధిలో కేసులను గుర్తించి పరిష్కారం అయ్యేలా పని చేయాలని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవిసాయి శ్రావణి, రేపల్లె రూరల్ సీఐ సురేష్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.