
టీబీ కేసులు గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలి
జిల్లాలో టీబీ కేసులు గుర్తించడంతోపాటు మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి టీవీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ కేసులపై వాల్పోస్టర్లను ఆయన సోమవారం ఆవిష్కరించారు. జిల్లాలో సోమవారం నుంచి టీవీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో టీబీ కేసులు వేగవంతంగా గుర్తించి మరణాలను తగ్గించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన వివరించారు. వృద్ధులు, పోషకాహార లోపం ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, హెచ్ఐవీ బాధితులు, ధూమపానం, మద్యపానం చేసే వారికి స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. పౌష్టికాహారం అందించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్ఓ డాక్టరు విజయమ్మ, లెప్రసీ, క్షయ నివారణ అధికారి డాక్టర్ మహమ్మద్ సాదిక్ పాల్గొన్నారు.