వెన్నుపోటుకు పేటెంట్‌ చంద్రబాబుదే ! | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుకు పేటెంట్‌ చంద్రబాబుదే !

Jun 3 2025 5:27 AM | Updated on Jun 3 2025 5:27 AM

వెన్నుపోటుకు పేటెంట్‌ చంద్రబాబుదే !

వెన్నుపోటుకు పేటెంట్‌ చంద్రబాబుదే !

గుంటూరు రూరల్‌: వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఈవిషయంలో పేటెంట్‌ ఆయనదేనని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం మండలంలోని ఏటుకూరు బైపాస్‌ నందున్న వైఎస్సార్‌ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఈనెల 4వ తేదీన నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు తనకు పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడన్నారు. ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తా.. ఆదాయాన్ని సృష్టిస్తా అని అబద్ధ్దాలు చెప్పి గద్దెనెక్కి నేడు రాష్ట్రంలోని ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.

సంపద సృష్టి పేరుతో పేదల కష్టం దోపిడీ

వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్‌ మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి విద్యుత్‌ చార్జీలను పెంచి పేదలు, రైతులను వెన్నుపోటు పొడిచాడన్నారు. సంపద సృష్టి పేరుతో గ్రామాల్లో వీధికి నాలుగు బెల్ట్‌ షాపులను నిర్వహిస్తూ మద్యాన్ని ఏరులా పారించి పేదల కష్టాన్ని దోచుకుంటున్నాడన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు పేదలు సంతోషంగా ఉంటే నచ్చదని, వారిని అణగదొక్కేందుకు ఎల్లపుడూ చూస్తుంటాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా నేటికి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోయారన్నారు. దానికితోడు నిత్యం వేల కోట్ల అప్పులు చేసి నేటికి ఆంధ్రరాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బలసాని కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 4న ఉదయం 10 గంటల నుంచి వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని పాత మల్లాయపాలెంలో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించి అక్కడినుంచి ర్యాలీగా వెళ్లి ప్రత్తిపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. పొన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అంబటి మురళీకృష్ణ, నగర అధ్యక్షురాలు, ఈస్ట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నూరి ఫాతిమా, మంగళగిరి ఇన్‌చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఏటుకూరులో వెన్నుపోటు దినం పోస్టర్‌ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement