అర్జీదారులతో సహృదయంతో వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీదారులతో సహృదయంతో వ్యవహరించాలి

Jun 3 2025 5:27 AM | Updated on Jun 3 2025 5:27 AM

అర్జీదారులతో సహృదయంతో వ్యవహరించాలి

అర్జీదారులతో సహృదయంతో వ్యవహరించాలి

బాపట్ల టౌన్‌: అర్జీదారులతో సహృదయంతో వ్యవహరించాలని ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ తుషార్‌ డూడీ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా చట్టపరిధిలో సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అర్జీదారులతో సహృదయ భావనతో వ్యవహరించినప్పుడే సమస్య, వారు పడే ఆవేదన అర్థం అవుతుందని చెప్పారు.అప్పుడే వేగంగా స్పందించి వారి సమస్యలు పరిష్కరించగలమని చెప్పారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి 44 మంది బాధితులు ఎస్పీకి తమ సమస్యలను తెలియజేశారు. కార్యక్రమంలో సీసీఎస్‌ డీఎస్పీ జగదీష్‌ నాయక్‌, పీజీఆర్‌ఎస్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సీ తుషార్‌ డూడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement