
కారు బోల్తా..ఐదుగురికి గాయాలు
ఉలవపాడు: ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై రాజుపాలెం జంక్షన్ వద్ద సోమవారం ఈ సంఘటన జరిగింది. వివరాలు... గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సీహెచ్.బాలభాస్కర్ కుటుంబ సభ్యులు, బంధువులు కలసి ఏడుగురు కారులో అరుణాచలానికి బయలుదేరారు. అందరూ మాట్లాడుకుంటూ సంతోషంగా వెళుతున్న సమయంలో రాజుపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న వారిలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఏ.విజయలక్ష్మి, లక్ష్మీవాణి, కామాక్షి, బాలభాస్కర్, సీతారావమ్మలకు గాయాలు కాగా వీరిని హైవే అంబులెన్స్ సిబ్బంది ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలకు తరలించారు. రోడ్ సేఫ్టీ సిబ్బంది బాధితులను హైవే అంబులెన్స్ లో ఎక్కించి పంపించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అరుణాచలం వెళ్తుండగా ఘటన

కారు బోల్తా..ఐదుగురికి గాయాలు