
హోంగార్డుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
రాయచోటి : హోంగార్డు సంక్షేమానికి ఎస్పీ విద్యాసాగర్నాయుడు కృషి చేస్తున్నారని హోంగార్డు కమాండెంట్ ఎం.మహేష్కుమార్ అన్నారు. రాయచోటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డు కవాతును శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ సిబ్బంది దురలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ఉపయోగాలు ఉంటాయని వివరించారు. ట్రాఫిక్ రెగ్యులేషన్, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా హోంగార్డులు ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్.ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం.పెద్దయ్య, బాలాజీ, రమేష్, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.
కమాండెంట్ మహేష్కుమార్