
వేర్వేరు కేసుల్లో 16 మంది అరెస్టు
రాయచోటి టౌన్ : వేర్వేరు కేసుల్లో 16 మందిని అరెస్టు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి తెలిపారు. రాయచోటి రూరల్ పరిధిలోని ఎగువ అబ్బవరం గ్రామానికి చెందిన ఆవుల గంగిరెడ్డి తన ఇంటి ముందు నుంచి మట్టి, ఇసుకను ట్రాక్లర్ల ద్వారా తరలిస్తూ ఉండటంతో అభ్యంతరం తెలిపాడు. దీనిపై ట్రాక్టర్ యజమానితో పాటు మరి కొందరు ఆయనతో గొడవపడ్డారు. ఈ విషయమై ఈ నెల 2వ తేదీ తమసీల్దార్కు ఫిర్యాదు చేసేందుకు గంగిరెడ్డి మోటార్ బైకుపై వెళుతుండగా అడ్డగించి దాడి చేసి గాయపరిచారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను గురువారం ఎస్ఐ విష్ణువర్దన్ అరెస్టు చేశారు. అలాగే రెండేళ్ల క్రితం ఒక అమ్మాయి విషయమై గొడవ పడిన సంఘటనలో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ తెలిపారు.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు
బారికేడ్లు వితరణ
రాయచోటి టౌన్ : రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లతో పాటు రాయచోటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు భారతి సిమెంట్ యాజమాన్యం బారికేడ్లు వితరణ చేసింది. గురువారం కంపెనీ ప్రతినిధులు రాయచోటి ట్రాఫిక్ సీఐ విశ్వనాథరెడ్డికి వీటిని అందజేశారు. వీటిని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి, సిబ్బంది రమణారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, డీలర్లు పి. రాజ, ఎం.లియాఖత్ ఆలీఖాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్ విజేత కడప
కడప వైఎస్ఆర్ సర్కిల్ : గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్లో వైఎస్సార్ కడప జిల్లా జట్టు విజయం సాధించినట్లు కడప జర్నలిస్టు టీం మేనేజర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. గుంటూరు పోలీసు గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చిత్తూరు జట్టుపై భారీ విజయం సాధించి కప్పును కై వసం చేసుకుందన్నారు. నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జట్ల పైన విజయం సాధించారన్నారు. కడప టీం సభ్యుడు పఠాన్ సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.

వేర్వేరు కేసుల్లో 16 మంది అరెస్టు