
రాజంపేటలో ఢిల్లీ రైల్కు హాల్టింగ్!
రాజంపేట: అధ్యాత్మికనగరం తిరుపతి నుంచి దేశరాజధానికి రాజంపేట, నందలూరు, కడప మీదుగా నడిచే ఢిల్లీ రైలు ఏపీసంపర్క్ క్రాంతి (12708/12707)రైలుకు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో హాల్టింగ్ ఇచ్చారు. దక్షిణమధ్య రైల్వే జీఎం ఆదేశాల మేరకు గుంతకల్ డివిజనల్ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి రాజంపేటలో ఏపీ సంపర్క్ క్రాంతిరైలు ఆగుతుందని రైల్వే వర్గాలు ధ్రువీకరించాయి. ఈ మేరకు డివిజన్ కేంద్రానికి ఎస్సీ రైల్వే జీఎం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. గత 17 సంవత్సరాలుగా ఢిల్లీ రైలు రాజంపేట మీదుగా నడుస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని అధ్యాత్మిక కేంద్రాల నుంచి ఢిల్లీకి వేగవంతమైన ప్రయాణానికి నేరుగా అనుసంధానం చేయడానికి అప్పటి రైల్వేమంత్రి లాలుప్రసాద్యాదవ్ సంపర్క్ క్రాంతిరైళ్లను తీసుకొచ్చారు. 2005 మార్చి రైల్వేబడ్జెట్లో ప్రకటించారు. అదే సమయంలో సికింద్రాబాద్ జోనల్ ప్రధానకార్యాలయం, సికింద్రాబాద్ జంక్షన్ ఢిల్లీ నిజాముద్దీన్కు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్రైలును జూలై 2005లో పట్టాలెక్కించారు.
దివంగత సీఎం వైఎస్సార్ చొరవతో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలుపై పడింది. ఈ రైలును అధ్యాతికనగరం తిరుపతి నుంచి కడప, రాజంపేట పార్లమెంటరీ కేంద్రాలైన రాజంపేట, కడప మీదుగా సికింద్రాబాద్ వరకు నడిపించాలని రైల్వేమంత్రిత్వశాఖను కోరారు. 2007లో ఈ రైలు సికింద్రాబాద్ టు ఢిల్లీకి నడిచింది.దీనిని తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, నందలూరు, కడప ,గుత్తి, డోన్, కర్నూలు, మహబూబ్నగర్ మీదుగా పొడిగించారు.
● సీమ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఉమ్మడి కడపజిల్లా వాసులు ఢిల్లీకి వెళ్లడానికి ఒక్కరైలు కూడా లేదు. వీరు ఢిల్లీ, ఉత్తరాది నగరాలకు వెళ్లాలంటే రేణిగుంటకు వచ్చి, అక్కడి నుంచి కేరళ ఎక్స్ప్రెస్ ద్వారా వయా నెల్లూరు, గూడూరు మీదుగా వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే వైఎస్సార్ చొరవ వల్ల ఇప్పుడు నేరుగా జిల్లా మీదుగా దేశరాజధానికి వెళ్లేందుకు రైలు అందుబాటులోవచ్చింది.
హర్షణీయం
ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు హాల్టింగ్ కల్పించడం హర్షణీయం. ఈ రైలు మన ప్రాంతం మీదుగా వెళ్లడానికి దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి కారణం ఇప్పుడు ఈ రైలుకు హాల్టింగ్ రావడం వెనుక ఎంపీ మిథున్రెడ్డి కృషి ప్రశంసనీయం. రైలు రాజంపేటలో ఆగడం వల్ల అటు తెలంగాణాకు, దేశరాజధానికి వెళ్లేందుకు అదనంగా మరో రైలు ఉన్నట్లే.
–పోలా శ్రీనివాసులరెడ్డి,
మున్సిపల్ చైర్మన్ రాజంపేట
జిల్లావాసులకు శుభవార్త
ఢిల్లీ రైలు హాల్టింగ్కు ఎంపీ పీవీ మిథున్రెడ్డి కృషి ఫలించింది. ఎట్టకేలకు రైల్వేఅధికారులు హాల్టింగ్ను ఈనెల 11 నుంచి అమలుచేయనున్నారు. జిల్లా వాసులకు శుభవార్త. –తల్లెం భరత్కుమార్రెడ్డి,
డీఆర్యుసీసీ,సభ్యుడు, రాజంపేట
రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్కు వినతిపత్రం అందచేస్తున్న వైఎస్సార్సీపీ లోక్సభ ఫ్లోర్లీడర్ పీవీ మిథున్రెడ్డి (ఫైల్)
11నుంచి అమలుకు సన్నాహాలు

రాజంపేటలో ఢిల్లీ రైల్కు హాల్టింగ్!

రాజంపేటలో ఢిల్లీ రైల్కు హాల్టింగ్!